Sea storm: రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతంపై తుపాను పంజా...

Sea storm: రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతంపై తుపాను పంజా...
20 లక్షల మందిపై తుపాను ప్రభావం

రష్యా ఆక్రమిత ప్రాంతం క్రిమియాపై తుపాను విరుచుకుపడింది. నల్ల సముద్రంలో ఏర్పడిన పెను తుపాను క్రిమియాను అతలాకుతలం చేసింది. 20 లక్షల మందిపై తుపాను ప్రభావం పడింది. నలుగురు మృతి చెందగా, భారీగా ఆస్తినష్టం సంభవించింది. రష్యా దక్షిణ భాగంలోని సోచీలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.తుపాను కారణంగా గంటకు 144 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దాంతో చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. గత 16 ఏళ్లలో ఇంతటి తీవ్రమైన తుపాను ఎప్పుడూ రాలేదని అధికార వర్గాలు అంటున్నాయి. సెవస్తపోల్ లో ఉన్న అరుదైన జలచరాలతో కూడిన ఆక్వేరియం తుపాను ధాటికి ధ్వంసమైంది. దాంతో, ఎన్నో అరుదైన చేపలు మృత్యువాతపడ్డాయి. అటు, ఉక్రెయిన్ కూడా ఈ తుపాను ప్రభావానికి గురైంది. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో ఉక్రెయిన్ లో 2 వేల పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి.


నల్ల సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రష్యా ఆక్రమిత క్రిమియా అతలాకుతలమైంది. దక్షిణ రష్యాలోని సోచీ తీరంలోనూ పెద్దఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. అనాపా, కుబాన్ తదితర ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. బలమైన గాలుల ధాటికి విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో రష్యాతోపాటు ఉక్రెయిన్లోని మాస్కో ఆక్రమిత ప్రాంతం, క్రిమియాల్లో కలిపి దాదాపు 20 లక్షల మంది అంధకారంలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. తుపాను సంబంధిత ఘటనల్లో నలుగురు మృతిచెందారని తెలిపారు. ఉక్రెయిన్లోనూ చాలా పట్టణాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానిక యంత్రాంగం తెలిపింది. తుపాను కారణంగా క్రిమియాలోని పలు ప్రాంతాల్లో ఆత్యయిక స్థితి ప్రకటించారు. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తున్నాయని, గత 16 ఏళ్లలో అత్యంత తీవ్రమైన తుపాను ఇదేనని స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేశారు. వరదల కారణంగా సెవస్తోపోల్లో ఓ భారీ అక్వేరియంలో 800కుపైగా అరుదైన చేపలు, ఇతర జలచరాలు మృత్యువాతపడ్డాయని స్థానిక వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నోవోరోసిస్క్ నౌకాశ్రయంలో చమురు లోడింగ్ను నిలిపేశారు


Tags

Read MoreRead Less
Next Story