CHINA: చైనాలో వరద బీభత్సం...20మంది మృతి

CHINA: చైనాలో వరద బీభత్సం...20మంది మృతి
భారీ వర్షాలకు అతలాకుతలమైన బీజింగ్‌.... 27మంది గల్లంతు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు...

భారీ వర్షాలు( heavy rains ) చైనా (China) ను అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని బీజింగ్‌ (Beijing) పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం, పోటెత్తిన వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 20కు( 20 people have died) పెరిగింది. మరో 27మంది (27 others are missing )గల్లంతయ్యారు. నగరాన్ని(Beijing floods) వరద ముంచెత్తడంతో ఈ ప్రమాదం సంభవించింది. బీజింగ్ చుట్టూ ఉండే పర్వతాల కారణంగా వరద ఉద్దృతి ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు రైల్వే స్టేషన్లు మూసివేశారు. ఆశ్రయంలేని పేదలను పాఠశాల జిమ్‌లకు తరలించారు.


బీజింగ్(Beijing) సహా చుట్టుపక్కల అనేక నగరాల్లో ఇళ్లు నీట మునిగాయి. అనేక రోడ్లు కోతకు గురయ్యాయి. కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. సాధారణంగా చైనా రాజధానిలో సాధారణంగా ఒక మోస్తరు వర్షం మాత్రమే కురుస్తుంది. ఉత్తర చైనా( many parts of north China) ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని...అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఉత్తర చైనాలోని నగరాలు, పట్టణాల్లో హైఎలర్ట్(High alerts ) ప్రకటించారు. శక్తివంతమైన గాలులు, భారీ వర్షం ధాటికి చైనీయులు వణికిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బస్సులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పలు అపార్ట్‌మెంట్‌లు భవనాలలో భారీగా వరద నీరు చేరింది.


హుబే ప్రావిన్సులో వరద తీవ్ర మరీ ఎక్కువగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ముందుగానే రైళ్లను నిలిపివేశారు. చూచౌ, లాంగ్‌ఫాంగ్‌ నగరాలను ఆకస్మిక వరద ముంచెత్తగా అనేక వాహనాలు చిక్కుకుపోయాయి. అగ్నిమాపక దళం రంగంలోకి దిగి వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించాయి.


చైనాలోని చాలా ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో బాధితులను పాఠశాలలు, రైల్వే స్టేషన్లకు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 50 ఏళ్లలో ఎన్నడు లేనంతగా ఉత్తర ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. 1961 తర్వాత పుజియాన్ ప్రావిన్స్‌లో అత్యధిక వర్షపాతం ఇప్పుడే నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఫుజియాన్ ప్రావిన్స్‌లో 4 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1998లో చైనాలో భారీ వరదలు సంభవించాయి. అప్పుడు 4,150 మంది మృతి చెందారు. ఎక్కువగా యాంగ్జీ నది పరివాహక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 2021లో హెనాన్‌ రాష్ట్రంలో వరదల కారణంగా 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story