Elon Musk: మస్క్ దిమాక్ ఖరాబైంది.. భారత్ మాజీ సీఈవోని కుక్కతో పోల్చుతూ..

Elon Musk: మస్క్ దిమాక్ ఖరాబైంది.. భారత్ మాజీ సీఈవోని కుక్కతో పోల్చుతూ..
ట్విట్టర్ కొత్త సీఈఓ అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్; భారత్ కు చెందిన పాత సీఈఓ కంటే ఈ శునకమే చాలా బెటర్ అంటూ కౌంటర్

వ్యంగ్యమైన ట్వీట్లతో విరుచుకుపడుతున్న ట్వీట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ తుగ్లక్ రాజు పనితనాన్ని గుర్తుచేస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో ట్వీట్ చేసిన మస్క్ సంస్థకు కొత్త సీఈఓను పరిచయం చేశాడు. అయితే అది ఓ శునకరాజం కావడం విశేషం. తన పెంపుడు కుక్క ఫోల్కీనే ట్విట్టర్ తాజా సీఈఓ అంటూ మస్క్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే దీనికి కొనసాగింపుగా సాగిన మస్క్ వ్యాఖ్యలు భారతీయులకు కంటగింపుగా మారాయి. తన కుక్క ఫోల్కీ పాత సీఈఓ కంటే ఎంతో ఉన్నతమైనదని మస్క్ వ్యాఖ్యానించాడు. ఇది లెక్కల్లో ఖచ్చితంగా ఉంటుందని అన్నాడు. భారత్ కు చెందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న వెంటనే పరాగ్ ను విధుల నుంచి తొలగించాడు. అతడితో పాటూ ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గడ్డే, సీఎఫ్ఓ నెల్ సెగల్ ను కూడా తొలగించాడు. దీంతో పాత సీఈఓను కుక్కతో పోల్చడం సరికాదని పలువు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్వీట్ మస్క్ దిగజారుడుతనానికి ప్రతీకగా నిలుస్తోందని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మస్క్ నుంచి ఇంతకు మించి ఆశించలేమని కామెంట్ చేస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story