Singappore: 20 ఏళ్లలో తొలిసారి మహిళకు మరణ శిక్ష

Singappore:  20 ఏళ్లలో తొలిసారి మహిళకు మరణ శిక్ష
నేరాలు, శిక్షల అమలు విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించే సింగపూర్

అన్ని చట్టాలకంటే మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల విషయంలో సింగపూర్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. కఠిన శిక్షలు అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరు దోషులకు మరణశిక్ష విధించింది. ఆ శిక్షను ఈ వారం అమలు చేయనుంది. అయితే ఈ శిక్ష పడిన ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉంది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత 20 ఏళ్లలో సింగపూర్లో ఓ మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి

సంఘటన వివరాలలోకి వెళితే..

50 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసులో ఓ 56 ఏళ్ల వ్యక్తి దోషిగా తేలాడు. అతడిని ఈ బుధవారం అంటే జూలై 26వ తేదీన చాంగీ జైలులో ఉరి తీయనున్నారు. ఈ మేరకు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ తెలిపింది.

అలాగే ఇదే కేసులో శిక్ష పడిన మరో మహిళ 45 ఏళ్ల సారిదేవి దామని కి జూలై 28వ తేదీన ఉరిశిక్ష అమలు చేయనున్నారు. సారిదేవి 30 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసులో 2018లో ఆమె ఉరిశిక్ష విధించారు. అప్పటినుంచి జైల్లోనే ఉన్న సారీ దేవికి ఇప్పుడు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వారి కుటుంబాలకు ఇప్పటికే నోటీసులు పంపించినట్లుగా స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ ఫార్మేటివ్ జస్టిస్ తెలిసింది.



ఈ ఉరిశిక్ష గనక అమలు అయితే సింగపూర్లో 20 ఏళ్లలో ఓ మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి కానుంది. గతంలో 2004లో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో ఓ 36 ఏళ్ల మహిళకు ఉరిశిక్ష వేసినట్టుగా సమాచారం.. ఆ తరువాత ఇదే మళ్ళీ ఉరి శిక్ష. అయితే, హక్కుల సంఘాలు ఉరిశిక్షను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి.

సింగపూర్ హత్యలు, కిడ్నాప్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తుంది. చాలా కఠినమైన శిక్షలను అమలు చేస్తుంది. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసుల్లో దోషులకు మరణశిక్ష తప్పనిసరి. అయితే కరోనా నేపథ్యంలో సింగపూర్ రెండేళ్ల పాటు మరణశిక్షలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్ళీ వాటిని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి కేసుల్లో 13మందిని ఉరి తీశారు.

Tags

Read MoreRead Less
Next Story