Israel Strikes: మరోసారి సిరియాపై దాడి చేసిన ఇజ్రాయెల్

Israel Strikes: మరోసారి సిరియాపై దాడి చేసిన ఇజ్రాయెల్
42 మంది సైనికుల మృతి

ఇజ్రాయెల్ మరోసారి సిరియాపై రెచ్చిపోయింది. ఓ పక్క హమాస్ తో యుద్ధం జరుగుతుండగానే సిరియాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. సిరియాలో అతిపెద్ద నగరమైన అలెప్పోపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. అయితే ఈ దాడిలో 42 మంది మృతి చెందారు.

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ దళాలు సిరియాపై దాడి చేశాయి. ఈ దాడిలో మొత్తం 42 మంది మృతి చెందగా.. వారిలో 36 మంది సిరియా సైనికులే ఉన్నట్లు ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది.

ఇజ్రాయెల్ దాడిలో సిరియా సైన్యం ఈ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్ బొల్లాకు చెందిన రాకెట్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ఆధారిత సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. ఇరాన్ కు అనుకూలంగా ఉన్న సిరియా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడులు జరిపిందని బ్రిటన్ సంస్థ పేర్కొంది. అయితే తమ సైనికులు మృతిచెందినట్లు సిరియా సైన్యం కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యంతో పాటుగా స్థానిక తిరుగుబాటు దళాలు కూడా దాడి చేసినట్లు సిరియా పేర్కొంది. ఈ దాడి సిరియా సైనికులతో పాటుగా సాధారణ పౌరులు కూడా కొంత మంతి మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

అలెప్పో, దాని పరిసర ప్రాంతాలపై తిరుగుబాటు వర్గాలు విరుచుకుపడ్డాయని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. యుద్ధాన్ని పరిశీలిస్తున్న బ్రిటన్‌కు చెందిన సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, అలెప్పో సమీపంలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో దాదాపు 42 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌ మద్దతుగల హిజ్బుల్లా ఉగ్రవాదులు సిరియాలో ఉండటంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తున్నది.

Tags

Read MoreRead Less
Next Story