Japan Earthquake: ఇప్పటికీ శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు..

Japan Earthquake: ఇప్పటికీ శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు..
62కు చేరిన భూకంప మరణాలు

జపాన్‌ను కుదిపేసిన పెను భూకంపంలో మృతులసంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు 62మంది మృతి చెందగా.భవన శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు....... సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని జపాన్‌ ప్రధాని కిషిదా పేర్కొన్నారు. మరోవైపు నిన్నటి నుంచి ఇప్పటివరకూ 150కి పైగా భూప్రకంపనలు సంభవించినట్లు అధికారవర్గాలు ప్రకటించాయి.


కొత్త సంవత్సరాదిరోజు భూకంపం సంభవించిన జపాన్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుస భూప్రకంపనలు బెంబేలెత్తించాయి. 3.4తీవ్రతతో మొదలైన ప్రకంపనలు ఒకదశలో వాటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.6కు పెరిగినట్లు అమెరికా భూభౌతిక సర్వే విభాగం వెల్లడించింది. భూకంపం ధాటికి చాలాచోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లపై వెళ్తున్న వాహనాలు భూమిలో కూరుకుపోయాయి. భూకంపం ధాటికి పెద్దపెద్ద భవనాలు పేకమేడలా కూలాయి. వాటి శిథిలాల కింద వందల సంఖ్యలో ప్రజలు చిక్కుకొన్నట్లు.. భావిస్తున్నారు. దుకాణాల్లో వస్తువులు, రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ సైన్‌ బోడ్లు, పుణ్యక్షేత్రాల్లోని స్తంభాలు., పిల్లర్లు ఊగిపోయాయి.ఆయా ప్రాంతాల సందర్శనకు వెళ్లినవారు హడలిపోయారు. భారీ భూకంపం ధాటికి ప్రజలు చనిపోవటమే కాకుండా భవనాలు కూలడం, అగ్నిప్రమాదాలు సహా పెద్దఎత్తున నష్టం జరిగినట్లు జపాన్‌ ప్రధాని ఫ్యూమియో కుషిదా..ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక బృందాలు కాలంతో పోటీపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. భూకంప మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. భూకంపం కారణంగా 45వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.ఈప్రాంతంలో ఉష్ణోగ్రతలు నీరు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయి. చాలా నగరాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వాజిమాపోర్టులోపెద్ద అగ్ని ప్రమాదం సంభవించటంతోపాటు అక్కడే ఏడంతస్థుల భవనం కుప్పకూలింది.


పర్యాటక ప్రదేశమైన వాజిమా నగరంలోని అసైచి వీధిలో భూకంపం కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. మంటల ధాటికి...... 200 భవనాలు కాలిపోయాయి. ఈ నగరంలోనే ఇప్పటివరకు 14 మరణాలు నమోదయ్యాయి. కొన్ని భవనాలు ఇప్పటికీ మంటల్లోనే ఉన్నాయి.నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు వారి.. వాహనాలు కదలడం అసాధ్యంగా మారాయి. ఇషికావాలోని సుజు ప్రాంతంలో... 50కి పైగా భవనాలు కూలిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. వీటిల్లో ఓ ప్రార్థనా మందిరం కూడా ఉంది. ఇక్కడి పోర్టును సునామీ అలలు తాకడంతో చాలా పడవలు బోల్తాపడ్డాయి. షికా ప్రాంతంలో టోగి వైద్యశాల భవనం ధ్వంసమైంది. చాలా ఇళ్లు కూలిపోయాయి.

జపాన్‌లో మంగళవారం కూడా భూప్రకంపనలు ఆగకపోవడం సహాయక చర్యలకు పెద్ద అడ్డంకిగా మారింది. ప్రాణనష్టం ఎంతో తెలుసుకోవడం జపాన్‌కు సవాలుగా మారింది.వేల సంఖ్యలో జపాన్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ఫైర్‌ ఫైటర్లు, పోలీసులను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. దెబ్బతిన్న ప్రధాన రహదారుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. భూకంప ప్రాంతానికి... వెయ్యి మంది సైనిక బలగాలను పంపామని జపాన్‌ రక్షణ మంత్రి మినోరు కిహారా తెలిపారు. మరో 8వేల 500 మంది సిబ్బందిని కూడా పంపనున్నట్లు చెప్పారు. నష్టాన్ని అంచనా వేసేందుకు 20 సైనిక విమానాలను పంపామని వివరించారు. భూకంప కేందానికి చుట్టూ ప్రధాన రోడ్డు మార్గాలను మూసివేశారు. టోక్యో నుంచి బుల్లెట్‌ ట్రైన్‌ సేవలను నిలిపేశారు. భారీ భూకంపం నేపథ్యంలో..జపాన్‌లో సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఎత్తివేశారు.

Tags

Read MoreRead Less
Next Story