Maldives: మాల్దీవుల పార్లమెంట్‌లో ఎంపీల తన్నులాట

Maldives: మాల్దీవుల పార్లమెంట్‌లో ఎంపీల తన్నులాట
పిడిగుద్దులతో రణరంగాన్నిమించి రక్తి కట్టిన పార్లమెంట్‌

మాల్దీవుల పార్లమెంట్‌లో ఇద్దరు ప్రజాప్రతినిధులు బాహాబాహీకి దిగారు. అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు క్యాబినెట్‌లోకి నలుగురు మంత్రుల చేరికకు పార్లమెంట్‌ ఆమోదం పొందడానికి ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారంలో భాగస్వాములైన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ), ప్రోగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవులు ఎంపీలు, విపక్ష మాల్దీవన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (ఎండీపీ) ఎంపీల మధ్య ఏర్పడిన వివాదం ఈ ఘర్షణకు దారితీసింది. తాము ప్రజాప్రతినిధులమనే విషయం మర్చిపోయి.. చట్టసభలోనే వీధి రౌడీల్లా ప్రవర్తించారు. తోపులాటలు, ముష్టిఘాతాలతో ప్రజాస్వామ్య దేవాలయం అట్టుడికి పోయింది.

మాల్దీవుల క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో ఆదివారం ఓటింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, విపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవుల ఎంపీల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు చినిచినికి గాలివానలా మారినట్టు ఘర్షణకు దారితీసింది. సభలో గందరగోళం సృష్టించిన కొందరు ఎంపీలు.. పోడియం పైకి స్పీకర్‌ కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఇంకొందరు స్పీకర్‌ సహా అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, ఓ ఎంపీ స్పీకర్ చెవి దగ్గర ట్రంపెట్ లాంటిది ఊదుతూ ఆయన్ను ఇబ్బంది పెట్టారు. పలువురు బెంచీల పైనుంచి దూసుకెళ్లి.. స్పీకర్‌ను నెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎంపీలు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. అధికార, విపక్ష ఎంపీలు ఒకరిపైఒకరు పిడిగుద్దులు, ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఇద్దరు ఎంపీలు కిందపడి దొర్లుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కిందపడిన ఒకర్ని మరో ఎంపీ కాలుతో తన్నుతుండటం కనిపించింది. సభ్యుల మధ్య వాగ్వాదం, ముష్టిఘాతాలకు సంబంధించిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. పలువురు బెంచీల పైనుంచి దూసుకెళ్లి.. స్పీకర్‌ను నెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎంపీలు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. అధికార, విపక్ష ఎంపీలు ఒకరిపైఒకరు పిడిగుద్దులు, ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. వీడియోలో కిందపడిన ఒకర్ని మరో ఎంపీ కాలుతో తన్నుతుండటం కనిపించింది.


ఈ చర్యను ప్రజలకు అందించే సేవలను అడ్డుకోవడంతో సమానమని అధికార పీఎన్సీ, పీపీఎం ఒక ప్రకటన విడుదల చేశాయి. స్పీకర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ముయిజ్జు ముఖ్య సలహాదారు, PNC చైర్‌పర్సన్ అబ్దుల్ రహీం అబ్దుల్లా మాట్లాడుతూ.. అధికారం లేకుండా కూడా మంత్రులకు తిరిగి నియమించబడే హక్కును సమర్థించారు. వాటిని ఆమోదించడానికి నిరాకరించడం బాధ్యతారహిత చర్య అని ఆయన మండిపడ్డారు. గొడవ సమయంలో ఇతర పార్లమెంటేరియన్లు సభలో ఆస్తులకు నష్టం కలిగించారని కొందరు ఎంపీలు ఆరోపించారు.


Tags

Read MoreRead Less
Next Story