Nepal vs China: నేపాల్‌లో చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం

Nepal vs China:  నేపాల్‌లో చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం
విద్వేష కంటెంట్ మీద చైనాకు గట్టి షాక్

చైనాకు చెందిన సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను నేపాల్ సోమవారం నిషేధించింది. ఈ యాప్ వల్ల దేశంలో సామరస్యం దెబ్బతింటోందని పేర్కొంది. ఈ యాప్‌తో సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న కారణంతో నిషేధం విధిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టు నేపాల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు తమ అనుబంధ కార్యాలయాలను నేపాల్‌లో ఏర్పాటు చేయాలని ఇదే కేబినెట్ బేటీలో నిర్ణయించారు.

భారత ప్రభుత్వం అనంతరం నేపాల్‌లోని పుష్ప్ కమల్ దహల్ ‘ప్రచండ’ ప్రభుత్వం కూడా చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన టిక్‌టాక్‌ను నిషేధించాలని కేబినెట్ సమావేశంలో నేపాల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు నేపాల్ కమ్యూనికేషన్స్ మంత్రి సోమవారం తెలిపారు. ఇంతకు ముందు కూడా భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ సహా చాలా దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించాయి. నేపాల్, చైనాల మధ్య వ్యూహాత్మక సాన్నిహిత్యం పెరుగుతున్న తరుణంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినప్పటికీ, సమాజంలోని పెద్ద వర్గంలో ద్వేషపూరిత ప్రసంగాల ధోరణిని టిక్‌టాక్ ప్రోత్సహిస్తోందని నేపాల్ ప్రభుత్వం విమర్శించింది. గత నాలుగేళ్లలో నేపాల్‌లో టిక్‌టాక్‌ కారణంగా 1647 సైబర్ నేరాలు నమోదయ్యాయి.

నేపాల్ పోలీస్ సైబర్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, టిక్‌టాక్ ప్రతినిధులు గత వారం ప్రారంభంలో ఈ అంశంపై చర్చించారు. సాంకేతిక సన్నాహాలు పూర్తయిన తర్వాత తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘సోషల్ నెట్‌వర్కింగ్ ఆపరేషన్‌పై దిశలు 2023’ చట్టాన్ని ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే అమలులోకి వస్తుంది. కొత్త నిబంధన ప్రకారం.. నేపాల్‌లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు దేశంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి.

నేపాల్‌లో టిక్‌టాక్ ద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహిస్తోందన్న విమర్శ ఉంది. గడిచిన నాలుగేళ్లుగా 1600కు పైగా సైబర్ క్రైమ్ కేసులు ఈ యాప్‌పై నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సైబర్ బ్యూరో పోలీస్‌లు , హోం మంత్రిత్వశాఖతో టిక్‌టాక్ ప్రతినిధులు ఓ వారం క్రితం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది.

Tags

Read MoreRead Less
Next Story