పాకిస్థాన్లో ఘోరరోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
By - shanmukha |27 Sep 2020 7:07 AM GMT
పాకిస్థాన్ లో ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నారు. కరాచీ-హైదరాబాద్ రహదారిలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్
పాకిస్థాన్ లో ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నారు. కరాచీ-హైదరాబాద్ రహదారిలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ సింధ్ ప్రావిన్స్లో అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వ్యాన్ బోల్తాపడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే 13 మంది సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురిని స్థానికులు కాపాడారు. అయితే, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల విచారణలో తేలింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి అనేక సార్లు పల్టీలు కొట్టడం వలన వాహనానికి ఉన్న సిలిండర్ నుంచి మంటలు చెలరేగి ప్రమాదం తీవ్రమైంది.మృతదేహాలను గుర్తించడానికి అవకాశం లేకుండా శరీరాలు కాలిపోయాయని అధికారులు చెబతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com