ఆమె అమ్మ కాదు హంతకి

ఆమె అమ్మ కాదు హంతకి
పిల్లల్ని చంపి ఏడేళ్ల పాటు ఫ్రీజర్ లో దాచిన మహిళ

తల్లి పిల్లల్ని కనుపాపలా చూసుకుంటుంది అంటారు. తన మొత్తం జీవితపు ఆనందాన్ని పిల్లల్లోనే వెతుక్కుంటుంది అమ్మ. అసలు అమ్మ అంటేనే ప్రేమ స్వరూపం. అలాంటి తల్లులు ఉన్న ఈ సమాజంలో పిల్లల పట్ల రాక్షసత్వంగా ప్రవర్తించే తల్లులు కూడా ఉంటారు. ఒకప్పుడు ఇలాంటి తల్లులు ఎక్కడో కనపడేవారు. ఎప్పుడో ఒక సందర్భాల్లో మాత్రమే వారి గురించి వినేవాళ్ళం. కానీ ఇప్పుడు లోకం అలా లేదు. తాజాగా, ఓ తల్లి చేసిన దారుణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుట్టిన మర్నాడే ఇద్దరు పిల్లల్ని చంపి ఫ్రీజర్‌లో దాచేసింది. భర్తకు కూడా తెలీకుండా దాచినా సరే ఈ విషయం చివరకు బయట పడింది.

దక్షిణ కొరియాలోని సియోల్‌ పరిధి సువాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఒక 30ఏళ్ల మహిళకు 8, 10, 12 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో పిల్లల పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఈమె 2018 నవంబర్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే కూతురు పుట్టిందన్న ఆనందం ఆమెకు ఏమాత్రం లేదు. ఎందుకంటే అప్పటికే ముగ్గురు పిల్లల పోషణ భారంగా మారడంతో నాలుగో సంతానాన్ని ఎలా పోషించాలి అనే దిగులు పట్టుకుంది. ఈ క్రమంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. శిశువు జన్మించిన మరుసటి రోజే గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచింది.

అనంతరం 2019 నవంబర్‌లో ఐదవ సంతానంగా మగపిల్లాడు పుట్టాడు.. అప్పుడు కూడా అదే పని చేసింది. అయితే ఇటీవల ఆడిట్ సందర్భంగా ప్రభుత్వ అధికారులు విచారించగా.. ఆస్పేత్రిలో సదరు మహిళకు రెండు సార్లు ప్రగ్నెన్సీ అని తెలిసినా పిల్లల లేకపోవడంతో జూన్‌లో పోలీసులు రంగం లోకి దిగారు. అయితే ఆ మహిళ మొదట పోలీసులకు అస్సలు సహకరించలేదు. అయితే వారెంట్తో వచ్చి మహిళ ఇంట్లో సోదాలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెండుసార్లు అబార్షన్ చేయించుకున్నాను అని భార్య తనకు చెప్పిందని, అంతే తప్ప ఫ్రీజర్లలో మృతదేహాలు ఉన్నాయన్న విషయం అసలు తెలియనే తెలియదు అన్నాడు భర్త. నేరం అంగీకరించడంతో నిందితురాలిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Tags

Read MoreRead Less
Next Story