US: భారత్‌-పాక్‌ చర్చలకు మద్దతిస్తాం

US: భారత్‌-పాక్‌ చర్చలకు మద్దతిస్తాం
ఎప్పటినుంచో అదే విషయం చెప్తున్నామన్న అమెరికా

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతు ఇస్తామని అమెరికా( United States) ప్రకటించింది. ఆందోళన కలిగించే అంశాలపై భారత్‌-పాకిస్థాన్‌ల చర్చలకు తాము మద్దతు ఇస్తామని, ఇదే విషయాన్ని తాము చాలాకాలంగా చెబుతూనే ఉన్నామని(support direct dialogue between India and Pakistan ) అగ్రరాజ్యం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలనే తాము చాలా ఏళ్లుగా భావిస్తున్నామని వైట్‌హౌస్‌ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించిన తర్వాత అమెరికా దీనిపై స్పందించింది.


ఇటీవల భారత్‌-పాక్‌ సంబంధాలపై పాకిస్థాన్‌ ప్రధాని( Pakistan PM) షెహబాజ్‌ షరీఫ్‌( Shehbaz Sharif) కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని తీవ్రమైన సమస్యలపై( All Serious Matters) భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు(Ready To Talk To India‌) ప్రకటించారు. పేదరికం, నిరుద్యోగం(poverty and unemployment)పై పోరాడుతున్న రెండు దేశాలకు యుద్ధం వాంఛనీయం కాదని( war is not an option) పేర్కొన్నారు. యుద్ధాల వల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, విద్య, ఆరోగ్యం, ప్రజాసంక్షేమం వంటి ముఖ్యమైన రంగాలకు ఆర్థిక వనరుల కొరత ఏర్పడిందని పాక్‌ ప్రధాని అన్నారు.

ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్‌ మినరల్స్‌ సదస్సు( Pakistan Minerals Summit) ప్రారంభ కార్యక్రమంలో షెహబాజ్‌ షరీఫ్‌( Prime Minister Shehbaz Sharif) పొరుగు దేశంతో సహా అందరితో చర్చలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తీవ్రమైన విషయాలను ఇరుగుపొరుగువారు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని. ఎందుకంటే యుద్ధమనేది ఎప్పటికీ ఓ పరిష్కారం కాదని షెహబాజ్‌ వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ ఎప్పుడూ తమ అంతర్భాగమేనని భారత్‌ చెప్పిన విషయాన్ని పాక్‌ ప్రధాని గుర్తు చేశారు. అసాధారణమైన సమస్యలను తొలగించుకోకపోతే అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.


జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి పాక్‌-భారత్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ ముగింపు పలికే వరకూ ద్వైపాక్షిక సంబంధాలు కష్టమేనని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

మరోవైపు మిత్రపక్షాల సంప్రదింపులతోనే ఆగస్టు 12లోపు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తామని(National Assembly Will Be Dissolved) షెహబాజ్ షరీఫ్ తెలిపారు. జాతీయ అసెంబ్లీ పదవీకాలం ఆగస్టు 12వతేదీతో ముగుస్తుందని, అంతకు ముందే అసెంబ్లీని రద్దు చేస్తామని షెహబాజ్ చెప్పారు. (Pakistan PM) ఎన్నికల సంఘం తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తుందని తెలిపారు. నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతతో సంప్రదింపులు జరిపి ఆపద్ధర్మ ప్రధాని గురించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మే 9 పాకిస్థాన్‌లో జరిగిన హింసాకాండలో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పిటిఐ కార్యకర్తలతో పాటు, రాజకీయ నాయకుల బృందం, కొంతమంది సైనికులు, వారి కుటుంబాలు కూడా పాల్గొన్నాయని షెహబాజ్ షరీఫ్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story