Taiwan: 24 గంటల వ్యవధిలో 103 చైనా యుద్ధ విమానాలు

Taiwan: 24 గంటల వ్యవధిలో 103 చైనా యుద్ధ విమానాలు
తైవాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు చైనా యత్నం

పొరుగు దేశాల విషయంలో ఆధిపత్య ప్రదర్శన కోసం డ్రాగన్ కంట్రీ చేసే ప్రయత్నాలు తీవ్ర తరం చేస్తుంది. తైవాన్ తమదేనంటూ హుంకరిస్తున్న చైనా మరోసారి దుందుడుకు చర్యలకు తెరదీసింది. ఇప్పటికే తైవాన్‌పై చైనా దేశ మిలిటరీ అధికారులు వేధింపులకు పాల్పడుతూ వస్తున్నారు. అయితే, తాజాగా.. ఏకంగా వందకి పైగా యుద్ధవిమానాలను తైవాన్‌ వైపు పంపించి తైవాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నించింది. ఇది చైనా చర్యలను కవ్వింపుగా తైవాన్ రక్షణ శాఖ చెబుతోంది. చైనా ఇప్పటి వరకు పంపిన యుద్శ విమానాల్లో.. 40 యుద్ధ విమానాలు తైవాన్‌ జలసంధి మధ్య రేఖను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇది అతి పెద్ద దుందుడుకు చర్యగా తైవాన్‌ అధికారులు చెబుతున్నారు. యుద్ధ విమానాలతో పాటు తొమ్మిది చైనా నౌకలనూ గుర్తించినట్లు తైవాన్ ప్రభుత్వం తెలిపింది. ఇదంతా 24 గంటల వ్యవధిలో జరిగిందని తైవాన్ వివరించింది.

మరోవైపు.. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అక్కడ ‘మధ్య రేఖ’ అంటూ ఏదీ లేదని.. తైవాన్ కూడా చైనాలో భాగమేనని ఆయన పేర్కొనడం గమనార్హం. మరోవైపు తాజాగా తైవాన్‌ను విలీనం చేసుకునేందుకు బీజింగ్‌ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరించింది. వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న వేళ.. ఈ ప్రణాళికను ఆవిష్కరించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి చేసే అవకాశం ఉంది.

తైవాన్‌కు సొంత ప్రభుత్వం, సైన్యం, రాజ్యాంగం ఉన్నప్పటికీ, డ్రాగన్ కంట్రీ మాత్రం ఆ దేశ ప్రభుత్వాన్ని తన అధినంలోకి తీసుకునేందుకు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. చైనా ఏకీకరణే లక్ష్యంగా ఆ దేశ ప్రభుత్వం వ్యూహాం రచిస్తుంది. తైవాన్ తాత్కాలికంగానే చైనా ప్రావిన్స్ నుంచివిడిపోయిందని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. శాంతియుత మార్గాల ద్వారా లేదా అవసరమైతే బలవంతంగా అయినా చైనా నుంచి విడిపోయిన తైవాన్‌ను మళ్లీ కలుపుకుంటామని ఆదేశ అధినేతలు చెబుతున్నారు. తైవాన్‌ను ప్రత్యేక దేశంగా అధికారికంగా గుర్తించొద్దని ఇతర దేశాలపై ఒత్తిడి చేయడం ద్వారా దౌత్యపరంగా తైవాన్‌ను ఒంటరి చేయాలని బీజింగ్ చూస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story