Greece Wildfire: కార్చిచ్చు కౌగిలిలో..

Greece Wildfire: కార్చిచ్చు కౌగిలిలో..
ప్రాణ భయంతో పారిపోతున్న ప్రజలు

గ్రీస్‌ను కార్చిచ్చు చుట్టేస్తోంది. గత గ్రీస్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంట్రీగేడ్‌లు దాటడంతో అంటుకున్న మంటలకు గంటకు 49 కిలోమీటర్ల వేగంతో వేస్తున్న గాలులు తోడయ్యాయి. ఈ దెబ్బకి పలు ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి.. ఇళ్లు, హోటళ్లను దహనం చేసుకొంటూ జనావాసాలపైకి వేగంగా వ్యాపిస్తోంది. రోడ్సే ప్రాంతంలో దాదాపు వారం క్రితం రేగిన మంటలు వేగంగా విస్తరిస్తూ మధ్యగ్రీస్‌, తూర్పు ప్రాంతాల్లోకి వ్యాపిస్తున్నాయి.

మంటలను ఆర్పేందుకు 40 ఫైర్‌ ఇంజిన్లు, 200 మంది సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. మూడు విమానాలు, ఐదు హెలికాప్టర్లు రంగం లోకి దిగాయి. ఇజ్రాయెల్‌, తుర్కియే, జోర్డాన్‌, క్రొయేషియా దేశాలు సైతం గ్రీస్‌ను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందించి అండగా నిలిచాయి. తాజాగా ఈ కార్చిచ్చు కోర్ఫు ప్రాంతానికి వ్యాపించాయి. రాత్రివేళల్లో వేగంగా వ్యాపిస్తూ కొండలు అగ్నిపర్వతాలను తలపిస్తున్నాయి. ఇవి ఆగ్నేయ దిశగా వ్యాపిస్తున్నట్లు వెల్లడించిన అధికారులు మంటలు సమీపిస్తున్న ప్రాంతం నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 19,000 మంది స్థానికులు, పర్యాటకులను రోడ్సే నుంచి గ్రీస్ అధికారులు కాపాడారు. వీరిలో 16 వేల మందిని భూమార్గంలో 3,000 మందిని సముద్ర మార్గాన తరలించారు. కార్చిచ్చుకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లలు, సామగ్రిని తీసుకొని ప్రజలు కాలినడకనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. కొందరు ఎందుకైనా మంచిదని బీచ్‌ల్లోనే తాత్కాలిక ఆశ్రయం ఏర్పాటు చేసుకుంటున్నారు. రోడ్సే అగ్ని కీలకలలు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు అక్కడి ఎయిర్‌పోర్టులోనే తలదాచుకుంటున్నారు.


మంటలు కోర్ఫ్ వైపు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో అక్కడి నుంచి 2,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రీకు చరిత్రలోనే తొలిసారి రోడ్సే నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రజలను తరలించారు. ఈ నేపథ్యంలో కార్ఫ్ సమీపంలోని శాంటా, మెగౌలా, పోర్టా, పాలియా పెరిథియా మరియు సినీస్‌లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story