Turkey: టర్కీలో భారీ భూకంపం.. వందల సంఖ్యలో ప్రజల మృతి
By - Subba Reddy |6 Feb 2023 5:15 AM GMT
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. నుర్దగీ సమీపంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదయ్యిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలియజేసింది. భూమి కంపించడంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు నేలకొరిగాయి. వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సైప్రస్, గ్రీస్, జోర్డాన్, లెబనాన్లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com