ట్విట్టర్‌లో కొత్త ఫీచర్.. ఫేక్ వార్తలకు చెక్

ట్విట్టర్‌లో కొత్త ఫీచర్.. ఫేక్ వార్తలకు చెక్
క్షణాల్లో విషయం తెలిసి పోతుందని సంబరపడినా మేలెంతో కీడు కూడా అంతే జరుగుతోంది నేటి తరం టెక్నాలజీ వాడుతున్న తీరు చూస్తుంటే.

నిజం నిద్ర లేచే లోపు అబద్దం ఊరంతా చుట్టేస్తుంది అనే సామెతని నిజం చేస్తూ ఈ రోజు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ వార్త విన్నాను నిజమేనా.. అని అడిగే లోపు ఊరంతా అదే విషయం చర్చిస్తూ ఉంటుంది.. ఇంతలో మర్నాడు అది ఫేక్ అంటూ మరో వార్త వస్తుంది. క్షణాల్లో విషయం తెలిసి పోతుందని సంబరపడినా మేలెంతో కీడు కూడా అంతే జరుగుతోంది నేటి తరం టెక్నాలజీ వాడుతున్న తీరు చూస్తుంటే.

అందుకోసమే సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీని కోసం ఫేస్‌బుక్ వార్నింగ్ లేబుల్ తీసుకొస్తుంటే ట్విట్టర్ కూడా ఇదే తరహాలో డిస్‌ప్యూటెడ్ ట్వీట్ (వివాదాస్పదమైన ట్వీట్) పేరుతో ఒక హెచ్చరికను జారీ చేస్తుంది. దీని ద్వారా మనం ఎక్కువ శాతం అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కానీ వీటి గురించి చాలా మందికి తెలియక పోవడం వల్ల వాటిని తిరిగి పోస్ట్ చేయడం లేదా రీట్వీట్ చేస్తుంటారు. ఇది సోషల్ మీడియా కంపెనీలకు తల నొప్పిగా మారింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ట్విట్టర్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

అందులో ఇది డిస్‌ప్యూటెడ్ ట్వీట్. నమ్మకమైన సమాచారం అందించే వేదికగా ట్విట్టర్‌ని ఉంచేందుకు సహాయపడండి. రీట్వీట్ చేసేముందు దాని గురించి మరింత సమాచారం తెలుసుకోండి అని సందేశం కనిపిస్తుంది. ఈ ఫీచర్ పరీక్షల్లో భాగంగా ఇది సత్ఫలితాలనిచ్చిందని, దీని వల్ల 29 శాతం మేర అసత్య వార్తల ప్రచారం తగ్గిందని ట్విట్టర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారిపై జరిగే తప్పుడు సమాచార వ్యాప్తికి ఇది కొంత వరకు అడ్డుకట్ట వేస్తుందని ట్విట్టర్ అభిప్రాయపడింది.

Tags

Read MoreRead Less
Next Story