US: అమెరికాలో ఆదోని యువతి మృతి
By - Subba Reddy |25 Jan 2023 10:45 AM GMT
రోడ్డుదాటుతుండగా ప్రమాదం: పోలీసు వాహనం ఢీకొని మరణించిన జాహ్నవి
ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసమని కన్నవారిని, ఉన్న ఊరుని వదిలి ఖండాలు దాటి అమెరికాకు వెళ్లింది. కానీ అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ లోకాన్నే వదిలేసింది. అమెరికాలోని సియాటెల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నులు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి అనే విద్యార్థిని మృతి చెందింది. ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లిన జాహ్నవి కాలేజి ముగించుకుని రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోల్ వాహనం కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. తమ కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. యువతి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com