కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి
By - TV5 Telugu |30 May 2019 3:23 PM GMT
తొలిసారిగా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కిషన్ రెడ్డితో ప్రమాణం చేయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డికి తన కేబినెట్ లో చోటు కల్పించారు మోదీ. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేతగా పార్టీకి దశాబ్దాలుగా సేవలు అందించిన కిషన్ రెడ్డికి ఎట్టకేలకు కేంద్రమంత్రి పదవి రావటంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com