- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ ఎన్నికయ్యారు. ముచ్చటిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. హరివంశ్ అనుభవం పెద్దల సభకు ఎంతో ఉపయోగపడుతుందని… మూడోసారి హరివంశ్ నారాయణ్ డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికయ్యారని.. చట్ట సభల్లో ఆయనకు చాలా అనుభవం ఉందని తెలిపారు. సభా విధానాలు, నియమాలు పట్ల కూడా మంచి అవగాహనం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 9న హరివంశ్ పదవీకాలం ముగియడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. తిరిగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక హరివంశ్ ఏప్రిల్ 10న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక చేపట్టారు. మరోసారి హరివంశ్కే అవకాశం దక్కింది.

అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్ లో టేక్నాఫ్ ప్రాంతం నుంచి బయల్దేరినట్లు ఈ ప్రకటనలో ఐరాస అధికారులు పేర్కొన్నారు. మలేసియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా మునిగినట్లు వెల్లడించారు. కాగా.. ఈ పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారని, అది కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిపారు.

డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఉన్న విగ్రహానికి ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, అధికారులు నివాళులర్పించారు.
ఖర్గే-మోడీ సంభాషణ
మరోసారి పార్లమెంట్ వేదికగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మోడీ-రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మధ్య సరదా సంభాషణ జరిగింది. దీంతో మోడీ-ఖర్గే మనసారా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భంగా మోడీ-రాహుల్ గాంధీ మధ్య కూడా చాలా సేపు సంభాషణ జరిగింది. తల్లి సోనియాగాంధీ ఆరోగ్య విషయాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హైలెట్గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఈనెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతిచర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తర్వాత మధ్యవర్తిత్వం చేయడానికి రష్యా ముందుకు వచ్చింది. ఇరాన్, అమెరికాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. మిడిల్ ఈస్ట్లో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు సహాయం చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ అన్నారు.
ఇదిలా ఉంటే, చర్చలు విఫలం కావడంతో ఇరాన్ స్పందించింది. అమెరికా ఇరాన్ విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విఫలమైందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ అన్నారు. రష్యా, ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో యూఎస్ దృక్ఫథం మారింది. గతంలో అలస్కా వేదికగా ఉక్రెయిన్, రష్యాల మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు.

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మీరా భయందర్ ప్రాంతంలోని మురికివాడల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మీరా భయందర్లోని ఇంద్రలోక్ ఫేజ్ 4లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, 40 ఏళ్ల వ్యక్తి మరణించారు. అయితే మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతోనే ఈ మంటలు ఎగిసిపడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల కారణంగా పశ్చిమాసియాలో వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం నేటితో ఏడవ రోజుకు చేరుకున్నది. ఈ యుద్ధంలో అత్యధికంగా ఇరాన్లో చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. ఇరాన్లో 181 మంది, లెబనాన్లో 7గురు, ఇజ్రాయెల్లో ముగ్గురు, కువైట్లో ఒకరు మృతి చెందినట్లు వెల్లడించింది.
యుద్ధాలను పిల్లలు ప్రారంభించరని కానీ వారు కూడా మూల్యం చెల్లించుకుంటున్నారని పిల్లల హక్కులు, ఆరోగ్యం, విద్య, సంక్షేమం కోసం పనిచేసే ఈ ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే చిన్నారులపై ఆందోళనకర ప్రభావాన్ని చూపిందని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త ఆపరేషన్లో మొదటి రోజు ఇరాన్లోని మినాబ్లో ఒక బాలికల పాఠశాలపై దాడి జరగగా, 160 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది.

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్(Britney Spears)ను పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం రాత్రి 9.30 నిమిషాల ప్రాంతంలో సీహెచ్పీ ఆఫీసర్లు బ్రిట్నీ స్పియర్స్ నడుపుతున్న వాహనాన్ని అడ్డుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమెపై కేసు బుక్ చేశారు. ఆ తర్వాత బ్రిట్నీ స్పియర్స్ను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో వాహనం నడుపున్న అనుమానంపై బ్రిట్నీ స్పియర్స్ను అరెస్టు చేసినట్లు కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ సమాచార అధికారి రియాన్ అయ్యర్స్ తెలిపారు. చాలా వేగంగా ఓ నలుపు రంగు బీఎండబ్ల్యూ కారు రోడ్డుపై సుడులు తిరుగుతూ వెళ్తున్నట్లు గమనించామని పోలీసులు చెప్పారు. వెంచురా కౌంటీలోని వెస్ట్లేక్ బౌల్యార్డ్ వద్ద కారును ఆపినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కారులో కేవలం బ్రిట్నీ స్పియర్స్ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు డ్రంకింగ్ పరీక్షలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.

మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ఆపరేషన్ లో వందలాది మంది మావోలు మృతి చెందారు. వీరిలో అత్యంత కీలకమైన మావో లీడర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది మావోలు లొంగిపోయారు. పలువురు మావోలు లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నారు. మరోవైపు, మావోలపై భద్రతాబలగాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి.
తాజాగా, ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి మృతదేహాలతో పాటు, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ... జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. పారిపోయిన మావోల కోసం కూంబింగ్ జరుగుతోందని వెల్లడించారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆదివారం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతకు గురికావడంతో పూణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రిలో చేరారు. తన తండ్రి దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని ఆయన కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. అనారోగ్యం కారణంగా చికిత్స పొంది ఆయన వారం రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చారు. శరద్ పవార్ డీహైడ్రేషన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో స్మార్ట్ఫోన్లు భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఆధారంగా మారాయి. బ్యాంకింగ్, UPI లావాదేవీలు, ప్రభుత్వ సేవలు మరియు రోజువారీ కమ్యూనికేషన్ వరకు మొబైల్ పరికరాలు వినియోగదారుల వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని నిల్వ చేస్తాయి. డిజిటల్ వినియోగం పెరగడం సౌలభ్యాన్ని తీసుకువచ్చినా, అదే సమయంలో సైబర్ నేరస్తులకు కొత్త అవకాశాలను కూడా సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఆధునిక సైబర్ ముప్పుల నుండి వినియోగదారులను రక్షించేందుకు ట్రేస్ఎక్స్ ల్యాబ్స్ TraceX Guard అనే AI ఆధారిత మొబైల్ భద్రతా యాప్ను ప్రారంభించింది.
భారతదేశంలో పెరుగుతున్న మొబైల్ సైబర్ నేరాలు
భారతదేశంలో మొబైల్ ఆధారిత సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఫిషింగ్ దాడులు, నకిలీ యాప్లు మరియు సోషల్ ఇంజినీరింగ్ పద్ధతుల ద్వారా సైబర్ నేరస్తులు వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సాంప్రదాయ యాంటీవైరస్ పరిష్కారాలు మాత్రమే ఆధునిక మోసాలను పూర్తిగా నిరోధించలేకపోతున్నాయి. దాడిదారులు వినియోగదారుల నమ్మకాన్ని ఉపయోగించి భద్రతా వ్యవస్థలను దాటిపోతున్నారు.
రిమోట్ యాక్సెస్ ట్రోజన్ ముప్పు
చాలా మొబైల్ దాడులు Remote Access Trojans (RATs) ద్వారా జరుగుతున్నాయి. ఈ మాల్వేర్ పరికరంపై పూర్తి నియంత్రణను దాడిదారులకు ఇస్తుంది. SMSలు మరియు OTPలను చదవడం, బ్యాంకింగ్ యాప్లను ప్రభావితం చేయడం, వ్యక్తిగత ఫైళ్లు మరియు ఫోటోలను యాక్సెస్ చేయడం, మైక్రోఫోన్ మరియు కెమెరాను రిమోట్గా యాక్టివేట్ చేయడం వంటి ప్రమాదాలు ఏర్పడుతాయి. చాలా సందర్భాల్లో, ప్రమాదకర అనుమతులు ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఆర్థిక నష్టం జరుగుతుంది.
TraceX Guard – ఆధునిక భద్రతా విధానం
TraceX Guard భారతదేశానికి అనుకూలంగా రూపొందించబడిన సమగ్ర మొబైల్ భద్రతా ప్లాట్ఫారమ్. ఇది కేవలం సిగ్నేచర్ ఆధారిత గుర్తింపుకే పరిమితం కాకుండా, AI మరియు రియల్-టైమ్ మానిటరింగ్ ద్వారా అనుమానాస్పద ప్రవర్తనను ముందుగానే గుర్తిస్తుంది. యాప్ ఇన్స్టాలేషన్ మూలాన్ని పరిశీలించడం, అనుమతులను విశ్లేషించడం మరియు ప్రమాదాలను సులభంగా అర్థమయ్యే విధంగా వినియోగదారులకు తెలియజేస్తుంది.
ప్రధాన భద్రతా ఫీచర్లు
TraceX Guard అనేక భద్రతా మాడ్యూల్లను కలిగి ఉంది. వాటిలో యాప్ రిస్క్ విశ్లేషణ, APK ఇన్స్టాలేషన్ మానిటరింగ్, QR మరియు URL స్కానింగ్, WiFi భద్రతా విశ్లేషణ, OTP మరియు SIM రక్షణ, డేటా బ్రీచ్ చెక్, ర్యాన్సమ్వేర్ గుర్తింపు మరియు ఫైల్ స్కానింగ్ ఉన్నాయి. ఈ యాప్ బహుభాషా మద్దతును కూడా అందిస్తుంది.
భారతదేశానికి ప్రత్యేకమైన థ్రెట్ ఇంటెలిజెన్స్
TraceX Guard భారతదేశంలో సాధారణంగా కనిపించే లోన్ యాప్ మోసాలు, ఫిషింగ్ ప్రచారాలు మరియు స్థానిక మాల్వేర్ నమూనాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఇది UPI మరియు మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారుల భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మొబైల్ వినియోగదారులు ఎందుకు సులభంగా లక్ష్యమవుతున్నారు
సైబర్ భద్రత నిపుణుల ప్రకారం, చాలా దాడులు సాంకేతిక లోపాల వల్ల కాకుండా అవగాహన లోపం కారణంగా జరుగుతున్నాయి. ప్రమాదకర అనుమతులు, దాచిన యాప్లు లేదా అనుమానాస్పద ఫైళ్లను వినియోగదారులు గుర్తించలేకపోతున్నారు. TraceX Guard ఈ సమస్యను స్పష్టమైన హెచ్చరికలు మరియు సూచనల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
సురక్షిత డిజిటల్ భవిష్యత్తు వైపు ఒక అడుగు
భారతదేశం పూర్తిగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా మారుతున్న సమయంలో మొబైల్ భద్రత మరింత కీలకమవుతోంది. AI ఆధారిత రక్షణ, రియల్-టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ మరియు వినియోగదారులకు సులభమైన డిజైన్తో TraceX Guard మొబైల్ సైబర్ భద్రతను బలోపేతం చేసే ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తోంది.

పిల్లలపై లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి అమెరికాలో ఒక భారతీయుడుని అరెస్ట్ చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లి అనే ఈ నిందితుడు సరైన పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించాడని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. నిందితుడిని న్యూజెర్సీలో అరెస్టు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేశారు.
13 సంవత్సరాల లోపు మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అతడిని దేశం నుంచి బహిష్కరించేందుకు న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

శివరాత్రి కానుకగా బీహార్ మహిళలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుడ్న్యూస్ చెప్పారు. మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. దీంతో నారీమణులంతా ఖుషిఖుషిగా ఉన్నారు. గత నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ముందు మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. దీంతో మహిళలంతా పెద్ద ఎత్తున ఓటింగ్కు తరలివచ్చి బీజేపీ కూటమికి గుద్దేశారు. దీంతో భారీ మెజార్టీతో నితీష్ కుమార్ కూటమి భారీ విజయం సాధించింది. ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకున్నారు. తిరిగి అదే జోష్లో ఉన్న నితీష్ కుమార్ తాజాగా మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జమ అయ్యాయి. శివరాత్రి సమయంలో డబ్బులు పడడంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారు.

టీ20 ప్రపంచకప్లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ గెలుపును మన దేశంతో పాటు ఆప్ఘనిస్థాన్లోనూ సంబరాలు జరుపుకున్నారు. అలాగే తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్న పాక్ లోని బెలూచిస్థాన్ ప్రజలు కూడా ఈ గెలుపు నేపథ్యంలో వేడుకలు చేసుకున్నారు. పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓడిపోయిందని తెలియడంతో బెలూచ్ ప్రజలు ఎంతో ఉత్సాహంగా సంప్రదాయ నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. భారత్ విజయం పట్ల వారు బాహాటంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆప్ఘనిస్థాన్లోనూ ప్రజలు రహదారుల పైకి వచ్చి గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నారు.

రోల్స్ రాయిస్(Rolls Royce) కంపెనీ ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరించనున్నది. అయితే యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన ఏరో ఇంజిన్లను అభివృద్ధి చేసేందుకు ఆ కంపెనీ ఆసక్తి ప్రదర్శిస్తున్నది. రక్షణ, పౌరవిమానయాన, ఎనర్జీ రంగాల్లోనూ రోల్స్ రాయిస్ కంపెనీ తన భాగస్వామ్యాన్ని విస్తరించనున్నది. భారత్కు అవసరమైన 120 కిలో న్యూటన్ క్లాస్ యుద్ధ విమాన ఇంజిన్ను అభివృద్ధి చేయనున్నామని, దీని కోసం యూకే ప్రభుత్వంతో సహా భారత్ ఆసక్తిగా ఉన్నట్లు కంపెనీ తన ప్రకటనలో చెప్పింది. కో డెవలప్మెంట్లో భాగంగా పూర్తి స్థాయిలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఐపీ ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ కానున్నది. ఈ నేపథ్యంలో రోల్స్ రాయిస్ సీఈవో టుఫాన్ ఎరిగిన్బిల్జిక్ గురువారం ప్రధాని మోదీని కలిశారు. భారత్ ప్రగతిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నట్లు రోల్స్ రాయిస్ సీఈవో తెలిపారు.

ఒక వృద్ధుడు 45 ఏండ్ల క్రితం తాను చేసిన దొంగతనాన్ని మరచిపోయి సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే చట్టం మాత్రం ఆ కేసును జ్ఞాపకం పెట్టుకొని తాజాగా అతడిని అరెస్ట్ చేసింది. పోలీస్ అధికారి శ్వేతా శుక్లా కథనం ప్రకారం.. సలీమ్, మరో ఆరుగురు కలిసి 1980లో బల్సాముంద్ కాకడ్ ప్రాంతంలోని పొలాల నుంచి రూ.100 విలువైన గోధుమలను దొంగిలించారు. ఆ తర్వాత సలీమ్ పక్కనే ఉన్న ధార్ జిల్లాలోని బాగ్ పట్టణానికి పారిపోయి అక్కడ ఒక కిరాణా దుకాణం నిర్వహిస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. సలీమ్పై వారెంట్ ఉండటంతో ఈ దొంగతనం కేసు కోర్టులో అలాగే పెండింగ్లో ఉంది. ఇటీవల మరో నిందితుడి కోసం సైబర్ విభాగం గాలిస్తుండగా సలీమ్ ఆచూకీ తెలిసింది.

ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ(Al Falah University) చైర్మెన్ జావెద్ అహ్మద్ సిద్ధికీని అరెస్టు చేశారు. చైర్మెన్ సిద్ధిక్పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల ఘటన తర్వాత యూజీసీ ఆ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఫోర్జరీ కోణంలో విచారణ సాగుతున్నది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని, ఆ వర్సిటీ చైర్మెన్ ఫోర్జరీకి పాల్పడినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధిక్ని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ కేసులో విచారణ కోసం నాలుగు రోజుల కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మరింత సమాచారం అందాల్సి ఉన్నది.

ఉత్తర జపాన్లోని దాదాపు 15 ప్రాంతాలను రెండు వారాలుగా భారీ హిమపాతం ముంచెత్తుతోంది. మంచు ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. తమ ఇంటిపై పేరుకుపోయిన మంచును తొలగించే క్రమంలో కిందికి జారిపడటం, హఠాత్తుగా గుండెపోటుకు గురవడం లాంటి కారణాలతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు గాయపడ్డారని పేర్కొన్నారు. సుమారు 2 మీటర్ల మేర మంచు పేరుకుపోవడంతో దేశవ్యాప్తంగా రైళ్లు, రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. 1,700కు పైగా ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు చెప్పారు. ఇంత అధికంగా మంచు కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారని.. రానున్న రోజుల్లో హిమపాతం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు టాక్సీ వేలో ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ప్రయాణికులు క్షేంగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రెండు విమానాల రెక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, ముంబై నుంచి కోయంబత్తూర్ బయలుదేరాల్సిన AI 2732 విమానం టాక్సీవేపై నిలిచివున్న సమయంలో, ఎదురుగా వచ్చిన ఇండిగో విమానం దాని వింగ్ టిప్ను తాకింది. దీంతో ఎయిర్ ఇండియా విమానం రెక్క చివరి భాగం దెబ్బతింది. దీంతో విమానాన్ని నిలిపేసి, సాంకేతిక పరిశీలన ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.
ఇండిగో సంస్థ ప్రకారం.. ఇండిగో విమానం 6E 791 హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చింది. టాక్సీ చేస్తుండగా మరో విమాన రెక్కని తాకినట్లు సంస్థ ప్రకటించింది. ఇండిగోలోని ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని, విమానాన్ని పరిశీలన కోసం పంపినట్లు చెప్పింది. సంఘటన తర్వాత రెండు విమాన సంస్థలు వెంటనే భద్రతా ప్రోటోకాల్స్ పాటించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మధ్యప్రదేశ్లోని మైహర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ ప్రత్యేక భోజనాన్ని కంచాలకు బదులుగా పేపర్లలో వడ్డించారు. భతిగ్వాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. వీడియోలో విద్యార్థులు నేలపై కూర్చుని పాత పుస్తకాల నుంచి తీసిన పేపర్లలో తమకు వడ్డించిన హల్వా-పూరీని తింటున్నారు. దీనిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు సత్నా, మైహర్ జిల్లాల ప్రజా సంబంధాల అధికారి రాజేశ్ సింగ్ తెలిపారు.

జార్ఖండ్ లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. సుమారు 22 మందిని చంపింది. రోజుకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. గుంపు నుంచి వేరుపడిన ఆ ఏనుగు మహాభీకరంగా ప్రవర్తిస్తోంది. పశ్చిమ సింగభుమ్ జిల్లాలో ఆ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆ జంతువును పట్టుకునేందుకు అటవీశాఖ 100 మందిని రంగంలోకి దింపింది. మూడుసార్లు ఆ ఏనుగుకు మత్తు మందు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని అదుపు చేయలేకపోయారు. బహుశా ఆ ఏనుడు మదంతో ప్రవర్తించి ఉంటుందని భావిస్తున్నారు. టెస్టెస్టరోన్ లెవల్స్ పెరగడం వల్ల ఆ ఏనుగు ప్రమాదకరంగా మారినట్లు కూడా అంచనా వేస్తున్నారు. మొదటిసారి ఓ మగ ఏనుగు ఈ స్థాయి బీభత్సం సృష్టించి ఉంటుందని ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ మీనా తెలిపారు.

ఉత్తర భారత్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, హర్యానాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 2.8గా నమోదైంది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది. హర్యానాలోని సోనిపట్లోనూ భూప్రకంపనలు జరిగాయి. సోమవారం ఉదయం 8:44 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలు గురించి ఎలాంటి సమాచారం అందలేదు.

అమెరికాలోని ఈస్టర్న్ మిసిసిపీలో శుక్రవారం రాత్రి జరిగిన వరుస కాల్పుల ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అలబామా సరిహద్దుకు సమీపంలోని వెస్ట్ పాయింట్ పట్టణంలో ఈ దాడులు జరిగాయి. మొత్తం మూడు చోట్ల నిందితుడు కాల్పులు జరిపినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. "హింస కారణంగా పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు" అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దాదాపు 20 వేల జనాభా కలిగిన క్లే కౌంటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. గతేడాది అక్టోబర్లో కూడా మిసిసిపీలో ఇలాంటి కాల్పుల ఘటనలు జరిగాయి. అప్పట్లో లేల్యాండ్ నగరంలో జరిగిన దాడిలో ఆరుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఉదయం ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర దగ్గుతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. భారీ వాయు కాలుష్యం వల్లే సోనియాకు అనారోగ్యం కలిగినట్లు తెలుస్తోంది. సీనియర్ పల్మోనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియాకు చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో, పార్టీ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో గెలిచి 2000లలో 16 రాష్ట్రాలను పరిపాలించింది. తదనంతరం ఆమె 2017లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

జమ్ముకశ్మీర్ లోని కశ్మీర్ లోయ లో మంచు దుప్పటి పరుచుకుంది. కశ్మీర్ వ్యాలీలోని ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ అయిన సోనామార్గ్లో తెల్లటి దూది వెదజల్లినట్టుగా మంచు పరుచుకున్నది. దాంతో కశ్మీర్ వ్యాలీ పరిసరాలన్నీ అందంగా, ఆహ్లాదకరంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి.
ఆ సుందర దృశ్యాలను టూరిస్టులకు కనువిందు చేస్తున్నాయి. కశ్మీర్ వ్యాలీలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గత కొన్ని రోజుల నుంచి మంచు విపరీతంగా కురుస్తున్నది. సన్నని దూది పింజాల్లా రాలుతున్న మంచును యాత్రికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కశ్మీర్ వ్యాలీ పరిసరాలన్నీ తెల్లని మంచు పరుచుకోవడంతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కింది వీడియోలో ఆ మంచు దృశ్యాలను మీరు కూడా ఒకసారి చూడండి.

ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. భికియాసైన్ – వినాయక్ రోడ్డులో ఒక ప్రయాణీకుల బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. విషయం తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.
పలు నివేదికల ప్రకారం.. భికియాసైన్-వినాయక్-జలాలి మోటార్ రోడ్డులోని శిలాపాణి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ద్వారహత్ నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో బయలుదేరిన బస్సు భికియాసైన్ నుంచి రామ్నగర్కు వెళుతూ.. మార్గమధ్యలో నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు భికియాసైన్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

నా అన్వేషన అన్వేష్ వ్యూస్ కోసం దిగజారిపోతున్నాడు. సోషల్ మీడియాలో ఏ టాపిక్ మీద చర్చ జరుగుతున్నా సరే మధ్యలోకి వచ్చి దరిద్రమైన వీడియోలు చేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ల బట్టలు పద్ధతిగా ఉండాలి అని చెప్పే క్రమంలో రెండు పదాలు దొర్లాడు. దానికి ఆయన సారీ చెప్పాడు. మహిళా కమిషన్ ముందు హాజరయి అక్కడ కూడా సారీ చెప్పాడు. కానీ అనసూయ, చిన్మయి లాంటి వారు రెచ్చిపోయి వీడియోలు చేశారు. శివాజీని తిట్టారు. అయితే మధ్యలోకి నా అన్వేషన అన్వేష్ కూడా వచ్చి చేరాడు. ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే.. శివాజీని బూతులు తిట్టాడు. చెప్పలేని విధంగా మాటలు అన్నాడు. గరికపాటి నర్సింహారావును పట్టుకుని చాలా నీచమైన కామెంట్ చేశాడు. కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడాడు అన్వేష్. మీ ప్రైవేట్ పార్టులు కట్ చేసుకోండి అంటూ శివాజీని, గరికపాటిని అనడం అంటే.. అన్వేష్ అహంకారానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.
ఆడవాళ్లు బట్టలు విప్పుకుని తిరిగినా సరే తప్పులేదు.. చూసేవాళ్లదే తప్పు అంటున్నాడు. పైగా పురాణాల్లో సీతాదేవి, ద్రౌపది ఏమైనా మాడ్రన్ బట్టలేసుకున్నారా. వాళ్లు చీరలు కట్టుకున్నాసరే వారిని ఎత్తుకెళ్లారు కదా అన్నాడు. ఇలా హిందూ దేవుళ్లను కూడా అవమానించాడు అన్వేష్. అన్వేష్ మీద సోషల్ మీడియా మొత్తం దుమ్మెత్తి పోస్తోంది. ఇంత ఘోరంగా మాట్లాడటంతో ఆయన్ను లక్షల మంది అన్ ఫాలో చేస్తున్నారు. యూట్యూబ్ లో కూడా లక్షల మంది అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. అన్వేష్ ప్రవర్తన మితిమీరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంత అహంకారపూరితంగా.. కనీస గౌరవం లేకుండా మాట్లాడటం అంటే అన్వేష్ కు ఎంత అహంకారం ఎక్కువైందో అర్థమైంది అంటున్నారు నెటిజన్లు.
హిందూ దేవుళ్లను, పండితులను, సంప్రదాయాలను అవమానిస్తూ వీడియోలు చేసిన అన్వేష్ ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే హిందూ సంఘాలు, వీహెచ్ పీ లాంటివి కంప్లయింట్స్ కూడా చేశాయి. మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం నౌకాదళ జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి.. నేవీకి చెందిన కల్వరి క్లాస్ సబ్ మెరైన్ ‘ఐఎన్ఎస్ వాఘ్షీర్’ లో ప్రయాణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి కూడా ఉన్నారు. కల్వరి క్లాస్ సబ్మెరైన్ లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కల్వరి క్లాస్ సబ్మెరైన్ లో ప్రయాణించారు. ఇదిలా ఉండగా, ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం రాఫెల్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు.

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 41 రోజుల పాటు కొనసాగిన మండల పూజ శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిసింది. ఈ సమయంలో సుమారు 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావేన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు. మండల పూజ సమయంలో ఆలయానికి మొత్తం రూ.332.77 కోట్ల ఆదాయం లభించిందని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.35.70 కోట్లు పెరగడం విశేషమన్నారు. మొత్తం ఆదాయంలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు వచ్చాయని, మిగిలిన ఆదాయం ప్రసాదాల విక్రయం, ఇతర వనరుల ద్వారా సమకూరినట్లు వివరించారు.

టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది . ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కిలిమంజారో పర్వతంపై ఉన్న బరాఫు క్యాంపు సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుందని టాంజానియా పౌర విమానయానశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పర్వతంపై ఉన్నవారిని వైద్యచికిత్స కోసం తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులతో పాటు డాక్టర్, టూరిస్ట్ గైడ్, పైలట్ ఉన్నట్లు వెల్లడించింది. అయితే, ఆ పర్యాటకులు ఏ దేశానికి చెందినవారనే వివరాలను మాత్రం తెలపలేదు. ప్రమాదానికి కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు.

ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నేటి నుంచి ఈనెల 18 వరకు మూడు విదేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. లింక్ వెస్ట్ పాలసీ, ఆఫ్రికా ఇనిషియేటివ్లో భాగంగా పర్యటన కొనసాగుతోంది. ఈ మూడు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనుంది. ద్వైపాక్షిక సంబంధాలతో దేశాలతో భారత్ సంబంధాలు బలపడనున్నాయి.
గత నెల నవంబర్ 21, 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 సమ్మిట్కు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సమ్మిట్కు ట్రంప్ గైర్హాజరయ్యారు. సౌతాఫ్రికాలో శ్వేత జాతి రైతులపై దాడులు నిరసిస్తూ ట్రంప్ నిరసన వ్యక్తం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండగా, వాయు కాలుష్యం మాత్రం క్రమంగా పెరుగుతోంది. నగరం మొత్తం గ్యాస్ ఛాంబర్లా మారింది. దేశ రాజధానిలో AQI 400 పాయింట్లు దాటింది. కొన్ని హాట్ స్పాట్లలో 500 పాయింట్ల వరకు నమోదైంది. ఇక ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. అయితే, ఢిల్లీ ఎయిర్పోర్టులోనూ విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. నగరంలో కాలుష్యం పెరగడంతో అధికారులు గ్రేడ్–4 చర్యలు అమలు చేస్తున్నారు. ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లో హైబ్రిడ్ (ఆన్లైన్, ఆఫ్లైన్) విధానంలో క్లాస్ లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, మిగతా సగం మంది ఇంటి నుంచి పని చేసేలా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గుజరాత్లోని సూరత్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఏడంతస్తుల టెక్స్టైల్ భవంతులో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్నట్లు సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ తెలిపారు. సుమారు 20 నుంచి 22 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నట్లు వెల్లడించారు. మంటలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బిల్డింగ్ పనులు జరుగుతున్నాయని.. అలాగే లోపల చాలా సామాగ్రి ఉందని తెలిపారు. 100-125 మంది అగ్నిమాపక అధికారుల, సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ జామర్ కారుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓఆర్ఆర్ వద్ద ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని జామర్ టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. వెంటనే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని నియంత్రించటంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు స్టెప్నీ టైర్ అమర్చటంతో వాహనం తిరిగి సీఎం కాన్వాయ్లో చేరింది. ఈ ఘటనతో కాన్వాయ్లోని భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, జామర్ వాహనానికి స్టెప్నీ టైర్ను అమర్చి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం వాహనం తిరిగి సీఎం కాన్వాయ్లో చేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా, వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది.

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన హవాయి ద్వీపం లో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలవేయ మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికివస్తోంది. వెయ్యి అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతోంది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం అగ్నిపర్వతం బద్దలైనట్టు అధికారులు తెలిపారు. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని స్పష్టంచేశారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కిలవేయ అగ్నిపర్వతం 38 సార్లు విస్ఫోటనం చెందింది.

కాల్పులతో దక్షిణాఫ్రికా దద్దరిల్లింది. హాస్టల్పై దుండగులు కాల్పులు జరిపారు. 11 మంది మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రిటోరియాలోని సాల్స్విల్లేలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో సాయుధులైన ముగ్గురు వ్యక్తులు హాస్టల్లోకి చొరబడ్డారు. 25 మందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.కాగా, ఈ సంఘటనలో 11 మంది మరణించారు. 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 11 మంది మృతుల్లో మూడు, 12 ఏళ్ల వయస్సున్న బాలురు, 16 ఏళ్ల యువతి ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించే ప్రాంతంలో ఈ కాల్పుల సంఘటన జరిగినట్లు చెప్పారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

దిత్వా తుఫాన్ ద్వీప దేశం శ్రీలంకను కుదిపేసింది. తుఫాను బీభత్సానికి కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో ఎక్కడికక్కడ వరదలు సంభవించాయి. ఇళ్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక పట్టణాలు పూర్తిగా నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. దిత్వా తుఫాను బీభత్సానికి భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. నవంబర్ 16 నుంచి ఇప్పటి వరకూ 486 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 341 మంది ఆచూకీ గల్లంతయింది. ఈ సంక్షోభ సమయంలో భారత దేశం శ్రీలంకకు అండగా నిలుస్తోంది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో మానవతా సాయాన్ని అందజేస్తోంది. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), భారత వాయు సేన ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


