చిట్టి న్యూస్

Police Suspended: హవాలా డబ్బు మాయం.. 11 మంది పోలీసులు సస్పెండ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ డీజీపీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. వాహ‌న డ్రైవ‌ర్ల నుంచి లంచాలు తీసుకుంటూ దొరికిన 11 మంది పోలీసుల్ని స‌స్పెండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో డీజీపీ రాజీవ్ కృష్ణ ఆదేశాలు జారీ చేశారు. వేర్వేరు జిల్లాలో వాహ‌న డ్రైవ‌ర్ల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ కావ‌డంతో వాటి ఆధారంగా డీజీపీ చ‌ర్య‌లు తీసుకున్నారు. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు ఆధారంగా 11 మందిని స‌స్పెండ్ చేశారు. చిత్ర‌కూట్‌, బందా, కౌషాంబి జిల్లాల్లో ప‌లు పోలీసుల్ని స‌స్పెండ్ చేశారు. పోలీసు శాఖ స్టేట్మెంట్ ప్ర‌కారం స‌స్పెండ్ అయిన వారిలో ఓ ఇన్‌స్పెక్ట‌ర్‌, ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, న‌లుగురు స‌బ్ స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్లు, అయిదుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

CM: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగుల జీతంలో కోత: సీఎం

ని­స్స­హా­య­కు­ల­కు సహా­యం అం­దిం­చ­డ­మే మన బా­ధ్యత అని అని గ్రూ­ప్‌-2 ఉద్యో­గా­ల­కు ఎం­పి­కైన అభ్య­ర్థు­ల­కు సీఎం రే­వం­త్‌­రె­డ్డి సూ­చిం­చా­రు. ‘‘తల్లి­దం­డ్రు­లు, పు­ట్టి పె­రి­గిన ఊరు­ను అభి­వృ­ద్ధి చే­సు­కో­వ­డం మన బా­ధ్యత.. మీ­రం­ద­రూ అం­కి­త­మ­వు­తా­ర­ని పూ­ర్తి వి­శ్వా­సం ఉంది. ఉద్యో­గా­ర్థు­లు ఎవ­రై­నా తల్లి­దం­డ్రు­ల­ను పట్టిం­చు­కో­క­పో­తే .. మీ జీ­తం­లో 10 నుం­చి 15శాతం కోత వి­ధిం­చి తల్లి­దం­డ్రుల ఖా­తా­లో వే­స్తా. ఒకటో తేదీ మీ జీతం ఎలా వస్తుం­దో.. అలా­గే మీ తల్లి­దం­డ్రుల అకౌం­ట్‌­లో ఒకటో తే­దీన పడు­తుం­ది. దీని కోసం త్వ­ర­లో చట్టం తీ­సు­కొ­స్తాం’’ అని సీఎం అన్నా­రు. హై­ద­రా­బా­ద్‌ శి­ల్ప కళా­వే­ది­క­లో జరి­గిన కా­ర్య­క్ర­మం­లో గ్రూ­ప్‌-2 ఉద్యో­గా­ల­కు ఎం­పి­కైన 783 మంది అభ్య­ర్థు­ల­కు సీఎం, డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క, సీ­ఎ­స్‌ రా­మ­కృ­ష్ణా­రా­వు, మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్‌.. చే­తుల మీ­దు­గా ని­యా­మక పత్రా­లు అం­ద­జే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా సీఎం మా­ట్లా­డా­రు. ‘‘శ్రీ­కాం­తా­చా­రి, వే­ణు­గో­పా­ల్‌­రె­డ్డి, ఈషా­న్‌­రె­డ్డి, యా­ద­య్య లాం­టి యువ వి­ద్యా­ర్థు­లు తమ జీ­వి­తా­ల­ను ధా­ర­పో­సి.. ఆత్మ­బ­లి­దా­నా­ల­తో తె­లం­గాణ రా­ష్ట్రా­న్ని సా­ధిం­చా­రు.

పథ­కా­లు, అభి­వృ­ద్ధి పనుల అమ­ల్లో ని­ర్ల­క్ష్యా­న్ని సహిం­చే­ది లే­ద­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. కొ­త్త ప్ర­భు­త్వం ఏర్పా­టై రెం­డే­ళ్లు గడు­స్తు­న్నా.. కొం­ద­రు అధి­కా­రుల పని­తీ­రు­లో ఇంకా మా­ర్పు రా­లే­ద­ని అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­రు. సీ­ఎ­స్‌ రా­మ­కృ­ష్ణా­రా­వు, సీ­ఎం­వో కా­ర్య­ద­ర్శు­ల­తో సీఎం సమా­వే­శ­మ­య్యా­రు. కొం­ద­రు ము­ఖ్య కా­ర్య­ద­ర్శు­లు, వి­భా­గా­ధి­ప­తుల పని­తీ­రు­పై అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­రు.

అధి­కా­రు­లు అల­స­త్వం వీడి అభి­వృ­ద్ధి పను­ల­పై దృ­ష్టి­సా­రిం­చా­ల­ని హి­త­వు పలి­కా­రు. సొంత ని­ర్ణ­యా­ల­తో అధి­కా­రు­లు ప్ర­భు­త్వా­ని­కి చె­డ్డ­పే­రు తీ­సు­కు­రా­వొ­ద్ద­ని సూ­చిం­చా­రు. అన్ని వి­భా­గా­లు సమ­న్వ­యం­తో పని­చే­స్తే­నే పను­లు వే­గ­వం­త­మ­వు­తా­య­ని, ప్ర­జ­ల­కు మేలు జరి­గే ని­ర్ణ­యా­లు, కా­ర్య­క్ర­మా­ల­కు ప్రా­ధా­న్య­మి­వ్వా­ల­ని ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. ఎప్ప­టి­క­ప్పు­డు ని­వే­ది­క­లు తె­ప్పిం­చు­కొ­ని, పనుల పు­రో­గ­తి­ని సమీ­క్షిం­చా­ల­న్నా­రు. ‘‘కీలక దస్త్రా­లు, పను­లు ఎక్క­డా ఆగి­పో­వ­డా­ని­కి వీ­ల్లే­దు. కేం­ద్రం నుం­చి గ్రాం­ట్లు, ని­ధు­లు రా­బ­ట్టు­కు­నే కా­ర్యా­చ­ర­ణ­ను వెం­ట­నే చే­ప­ట్టా­లి. ఇకపై సీ­ఎ­స్‌, సీ­ఎం­వో అధి­కా­రు­లు ప్ర­తి­వా­రం ని­వే­ది­క­లు అం­దిం­చా­లి’’ అని ఆదే­శిం­చా­రు.

Usa : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. స్పాట్‎లోనే నలుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కరోలినాలోని సెయింట్‌ హెలినా దీవిలో తెల్లవారుజామున ఓ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. విల్లీస్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లో ఆదివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో జనాలు ఉండటం గమనించిన దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారని.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తుపాకీ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు అనేక మంది సమీపంలోని షెల్టర్లు, షాపుల్లోకి పరిగెత్తారని వివరించారు.

Mrs Universe  : మిసెస్‌ యూనివర్స్‌గా షెర్రీ సింగ్‌

అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత పతాకం రెపరెపలాడింది. భారత్‌కు చెందిన షెర్రీ సింగ్‌ మిసెస్‌ యూనివర్స్‌ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్‌ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఆమె 120 మందితో పోటీ పడి కిరీటాన్ని దక్కించుకున్నారు.

తొమ్మిదేండ్ల క్రితం వివాహమై ఒక కుమారుడు ఉన్న షెర్రీ సింగ్‌ విజేతగా నిలిచిన తర్వాత ‘ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదు. హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదీ. బలం, దయ, పట్టుదల మహిళ నిజమైన అందానికి నిదర్శనం అని నేను ప్రపంచానికి చూపాలనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. తనను విజేతగా ప్రకటించిన తర్వాత ఆమె భారత జెండాను చేతబట్టి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్‌ను గర్వపడేలా చేసిందని మిస్‌ యూనివర్స్‌ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు. ఆమెకు ఇన్‌స్టాలో 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Mississippi Shooting: అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి, పలువురికి గాయాలు

అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. లేలాండ్ పట్టణంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు. మిసిసిపీ రాష్ట్ర సెనేటర్ డెరిక్ సిమ్మన్స్ ఈ ఘటనను ధృవీకరించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా అక్కడ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు.

మ్యాచ్ అనంతరం ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఆ సమయంలో కాల్పులు చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని జాక్సన్ నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాల్పులకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని నగర మేయర్ జాన్‌లీ ఒక వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు లేలాండ్ పోలీస్ డిపార్టుమెంట్ తెలిపింది.

LADDU: వేములవాడలో బూజు పట్టిన లడ్డూలు?

వే­ము­ల­వాడ శ్రీ­రా­జ­రా­జే­శ్వర స్వా­మి దే­వ­స్థా­నం­లో నా­సి­ర­కం లడ్డూల అమ్మ­కం కల­క­లం రే­పిం­ది. తేమ సరి­గా ఆర­కుం­డా­నే బూజు పట్టిన లడ్డూ­ల­ను సి­బ్బం­ది అమ్ము­తు­న్నా­ర­ని బీ­జే­పీ నే­త­లు ఆరో­పిం­చా­రు. లడ్డూ­లు తీ­సు­కొ­చ్చే ట్రేల నుం­చి దు­ర్వా­సన వస్తోం­ద­ని మం­డి­ప­డు­తు­న్నా­రు. పవి­త్రం­గా భా­విం­చే లడ్డూ ప్ర­సా­దా­న్ని ఇలా వి­క్ర­యిం­చ­డం ఏం­ట­ని ప్ర­శ్ని­స్తు­న్నా­రు. ప్ర­సా­దాల అమ్మ­కా­ల­ను ని­లి­పి­వే­యా­ల­ని డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు.

Sergio Gor: భార‌త్‌కు అమెరికా అంబాసిడ‌ర్‌గా సెర్గియో గోర్‌

భార‌త్‌కు అంబాసిడ‌ర్‌గా సెర్గియా గోర్‌(Sergio Gor)ను క‌న్ఫ‌ర్మ్ చేసింది అమెరికా. సేనేట్‌లో మంగ‌ళ‌వారం 38 ఏళ్ల గోర్‌ను ఏక‌గ్రీవంగా నామినేట్ చేశారు. 51 మంది సేనేట‌ర్లు అనుకూలంగా, 47 మంది వ్య‌తిరేకంగా ఓటేశారు. ప్ర‌స్తుతం అమెరికా ప్ర‌భుత్వం ష‌ట్‌డౌన్‌లో ఉన్నా.. భార‌త్‌కు సెర్గియో గోర్‌ను అంబాసిడ‌ర్‌గా అమెరికా నియ‌మించింది. ద‌క్షిణాసియా దేశాల వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా పౌల్ క‌పూర్‌ను నామినేట్ చేశారు. సింగ‌పూర్‌కు అంజ‌నీ సిన్హాను అంబాసిడ‌ర్‌గా అమెరికా ప్ర‌క‌టించింది.

అమెరికా, భార‌త్ మ‌ధ్య సంబంధాలు మ‌రింత బలోపేతం అవుతాయ‌ని సెర్గియో గోర్ అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్ త‌మ‌కు వ్యూహాత్మ‌క భాగ‌స్వామి అని, ఆ దేశం వ‌ల్ల‌ ప్రాంతీయ ప్రాబ‌ల్యం పెరుగుతంద‌న్నారు. భార‌త్‌తో భాగ‌స్వామ్యం నేప‌థ్యంలో అమెరికా ప్ర‌యోజ‌నాల గురించి వివ‌రించ‌నున్న‌ట్లు చెప్పారు. అమెరికా, ఇండియా మ‌ధ్య వాణిజ్య సంబంధాల వ‌ల్ల అమెరికా పోటీత‌త్వం పెరుగుతోంద‌ని, ఇత‌ర దేశాల‌పై చైనా ఆర్థిక ప్ర‌భావం కూడా త‌గ్గుతుంద‌ని గోర్ తెలిపారు.

ప్రాంతీయ స్థిర‌త్వం, భ‌ద్ర‌త అంశాల్లో భార‌త పాత్ర‌ను విస్మ‌రించ‌లేమ‌ని ఆయ‌న అన్నారు. ద‌క్షిణాసియా ప్రాంతం స్థిరంగా ఉండాల‌న్న‌ది అమెరికా ఆకాంక్ష అని తెలిపారు.

Chennai: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..

పండగ పూట తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ముగ్గురు అక్కడికిక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెలవుల నేపథ్యంలో యువకులు చెన్నై నుండి మున్నార్ ట్రిప్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని జాతీయ రహదారిపై కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ముగ్గురు అక్కడికిక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అదృష్టవశాత్తు ఇద్దరు యువకులు బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని.. మృతదేహాలను పోస్ట్ మార్టం కు తరలించారు.

Earthquake : మయన్మార్‌లో భూకంపం..

మయన్మార్‌లో భారత సరిహద్దుల వెంబడి స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.7గా నమోదయింది. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు 27 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంతో ఆ రాష్ట్రంతోపాటు నాగాలాండ్‌, అస్సాంలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. భూ అంతర్భాగంలో 15 కిలోమీట్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మొలజీ (NCS) తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉన్నది.

కాగా, సోమవారం అర్ధరాత్రి 12.09 గంటల సమయంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 3.4గా ఉందని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. ఇక టిబెట్‌లో కూడా మంగళవారం ఉదయం భూకంపం వచ్చింది. ఉదయం 4.28 గంటలకు 3.3 తీవ్రత ప్రకంపణలు వచ్చాయి. అస్సాంలోని దిబ్రూగఢ్‌కు 303 కిలోమీటర్లు, అరుణచల్‌ ప్రదేశ్‌లోని పంగిన్‌కు 227 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నదని పేర్కొంది.

Liquor Sales : మద్యం అమ్మకాల్లో కర్ణాటక టాప్‌..

ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ అమ్మకాల్లో దక్షిణాది రాష్ర్టాలు టాప్‌ పొజిషన్‌లో నిలిచాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక  ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో 23.18 కోట్ల కేసుల ఐఎంఎఫ్‌ఎల్‌ అమ్ముడుపోయింది. అంటే దేశంలో జరిగిన అమ్మకాల్లో 58 శాతం ఇక్కడే జరిగాయి. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బెవరేజ్‌ కంపెనీస్‌ ఈ సమాచారాన్ని వెల్లడించింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఐఎంఎఫ్‌ఎల్‌ అమ్మకాల్లో దక్షిణాది ఆధిపత్యం దాదాపు పరిపూర్ణంగా ఉంది. 58 శాతం అమ్మకాలు ఇక్కడే జరుగుతున్నాయి. మిగిలిన 42 శాతం దేశంలోని ఇతర రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుగుతున్నది. అయితే, కర్ణాటకలో 6.88 కోట్ల కేసులు అమ్ముడుపోవడంతో ఆ రాష్ట్రం ఈ చార్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడులో 6.47 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి.

VJA UTSAV: విజయవాడ ఉత్సవ్‌లో ఉప రాష్ట్రపతి

ఉప­రా­ష్ట్ర­ప­తి సీపీ రా­ధా­కృ­ష్ణ­న్‌ పు­న్న­మి ఘా­ట్‌­లో ని­ర్వ­హి­స్తు­న్న వి­జ­య­వాడ ఉత్స­వ్‌­లో పా­ల్గొ­న్నా­రు. ఉప­రా­ష్ట్ర­ప­తి అయ్యాక తొ­లి­సా­రి వి­జ­య­వాడ పర్య­ట­న­కు రా­వ­డం సం­తో­షం­గా ఉం­ద­న్నా­రు. ‘‘ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ దే­శా­ని­కి అన్న­పూ­ర్ణ­లాం­టి­ది. ఈ రా­ష్ట్రం అన్ని రం­గా­ల్లో దూ­సు­కె­ళ్తోం­ది. వి­జ­య­వాడ హా­ట్‌ సిటీ.. కూ­ల్‌ పీ­పు­ల్‌. ఇది అభి­వృ­ద్ధి చెం­దిన గొ­ప్ప నగ­రం­గా మా­రా­లి. చం­ద్ర­బా­బు నా­య­క­త్వం­లో రా­ష్ట్రం వి­క­సి­త్‌ ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ది­శ­గా దూ­సు­కె­ళ్తోం­ది. ఈ పర్య­ట­న­ను నా జీ­వి­తం­లో మరి­చి­పో­లే­ను. తె­లు­గు­వా­రి సం­స్కృ­తి, సం­ప్ర­దా­యా­లు చాలా గొ­ప్ప­వి. ప్ర­జ­లం­ద­రి­కీ దు­ర్గ­మ్మ ఆశీ­స్సు­లు ఉం­డా­లి.. జై ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌’’ అని ఉప­రా­ష్ట్ర­ప­తి అన్నా­రు. ప్రా­రం­భం­లో అం­ద­రి­కీ “తె­లు­గు భా­ష­లో నమ­స్కా­రం” చె­ప్పి తన ప్ర­సం­గా­న్ని కొ­న­సా­గిం­చిన ఉప­రా­ష్ట్ర­ప­తి, తె­లు­గు భాష అందం, సా­హి­త్యం, సం­గీ­తం వై­భ­వా­న్ని ప్ర­శం­సి­స్తూ, “అం­ద­మైన తె­లు­గు­లో పా­డిన పా­ట­లు అద్భు­తం­గా ఉం­టా­యి. సా­హి­త్య­భ­రి­తం­గా, సం­గీ­త­భ­రి­తం­గా ఉం­డ­ట­మే తె­లు­గు భా­ష­ను ప్ర­త్యే­కం చే­స్తోం­ది” అని అన్నా­రు.

Alexander Duncan: హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికాలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. డంకన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్.. డంకన్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. ఈ విషయాన్ని పరిష్కరించాలని టెక్సాస్‌లోని రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేశారు.

2024లో టెక్సాస్‌లో హనమాను విగ్రహం ఏర్పాటు చేశారు. స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఆవిష్కరించారు. యూఎస్‌లో ఎత్తైన హిందూ స్మారక చిహ్నాలలో ఇదొకటి. అమెరికాలోనే మూడో ఎత్తైన విగ్రహం ఇదే. 90 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు.

OG Trailer : పవన్ కళ్యాణ్ రా పవర్.. సుజీత్ స్టైలిష్ విజన్!

నిరీక్షణకు తెరపడింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు యావత్ సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) అధికారిక ట్రైలర్ వచ్చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన క్షణం నుండి వ్యూస్ మరియు లైకుల వర్షంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది కేవలం ఒక ట్రైలర్ కాదు, సెప్టెంబర్ 27న థియేటర్లలో ఎలాంటి అగ్నిపర్వతం బద్దలు కాబోతోందో చూపించే ఒక చిన్న శాంపిల్ మాత్రమే.

యువ దర్శకుడు సుజీత్ తన మేకింగ్‌తో మ్యాజిక్ చేశాడని చెప్పడానికి ఈ ట్రైలరే నిదర్శనం. ప్రతి ఫ్రేమ్‌ను ఒక పెయింటింగ్‌లా చెక్కాడు. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్‌లోని అసలైన ఫైర్‌ను, ఆయన కళ్ళలోని తీవ్రతను సుజీత్ అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చాడు. ముంబై అండర్‌వరల్డ్‌ను జపాన్‌లోని యాకుజా (Yakuza) కల్చర్‌తో మిక్స్ చేసి, కథకు ఒక ఇంటర్నేషనల్ ఫీల్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చేతిలో కటానా పట్టుకుని నడుస్తుంటే, అది కేవలం ఒక స్టైల్ స్టేట్‌మెంట్ కాదు, తన పాత్ర యొక్క క్రూరత్వాన్ని, శక్తిని ప్రతిబింబిస్తుంది

సుజీత్ దర్శకత్వ ప్రతిభ, పవన్ కళ్యాణ్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, మరియు వినూత్నమైన కథాంశం కలగలిపి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో ‘ఓజీ’ సృష్టించబోయే ప్రభంజనం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Gujarat: గుజరాత్‌ తీరంలో నిత్యవసర వస్తువులతో వెళ్తున్న నౌక దగ్ధం

గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్ జెట్టీ దగ్గర జామ్‌నగర్‌కు చెందిన కార్గో షిప్ మంటల్లో కాలిపోయింది. 950 టన్నుల బియ్యం, 100 టన్నుల చక్కెరను తీసుకెళ్తుండగా హరిదాసన్ అనే కార్గో షిప్ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది.

అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి వెళ్లి మంటలను ఆర్పేశారు. కార్గో షిప్ సోమాలియాలోని బోసాసోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. డీజిల్ కారణంగా మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. అయితే ప్రమాదం జరగగానే ఓడరేవు నుంచి కిలోమీటర్ దూరంలోకి లాక్కెళ్లారు. అనంతరం 100 కి.మీ సముద్రంలోకి తీసుకెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్ గార్డ్స్ సహకారంతో మంటలను అదుపు చేశారు. నౌకలో మంటలు అంటుకోగానే పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. దీన్ని చూసేందుకు సమీపంలోని స్థానికులు బీచ్ దగ్గరకు వచ్చి వీక్షించారు.

Anil Chauhan: బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’ - సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌

బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం సైన్యమేనని (Indian Army) సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. రాంచీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. దేశసేవ చేయాలంటే సైన్యంలో చేరాలన్న లక్ష్యం పెట్టుకోవాలని చిన్నారులకు సూచించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రకృతి విపత్తు ఘటనల్లో అనేక మంది పౌరులను రక్షించేందుకు సైన్యం కృషి చేసిందన్నారు.

‘‘బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం సైన్యం. దేశసేవ చేయాలనుకుంటే, దేశంతోపాటు ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటే త్రివిధ దళాల్లో చేరడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇక్కడ కష్టపడితే గుర్తింపు తప్పకుండా వస్తుంది’’ అని జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. చిన్నారులతో ముచ్చటించిన ఆయన.. ఈ ఏడాది ప్రకృతి విలయ సంఘటనలు అధికంగా చోటుచేసుకున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లలో అనేక మందిని రక్షించేందుకు సాయుధ దళాలు తీవ్ర కృషి చేశాయన్నారు.ఆపరేషన్‌ సిందూర్‌ గురించి సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. మే 7న అర్ధరాత్రి శత్రు స్థావరాలపై దాడులు చేశామని, ఒంటి గంటకు తొలి దాడి జరిగిందని చెప్పారు. సుదీర్ఘ లక్ష్యాలపై రాత్రి వేళల్లో దాడులు చేయాలంటే ప్రత్యేక కృషి అవసరమన్నారు.

Lunar Eclipse :  క‌నువిందు చేసిన సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఎరుపు వ‌ర్ణంలోకి మారిన చంద్రుడు..

ఆకాశంలో ఓ అద్భుతమైన ఖగోళ పరిణామం చోటుచేసుకుంది. భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు కొన్నిచోట్ల పూర్తి ఎరుపు రంగులో దర్శనమివ్వనుండటం విశేషం. దీన్నే ఖగోళ శాస్త్ర పరిభాషలో 'బ్లడ్ మూన్' అని పిలుస్తారు. ఈ అరుదైన దృశ్యం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే, భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటల 50 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం మొదలైంది. ఇది అర్ధరాత్రి దాటి సోమవారం తెల్లవారుజామున 1 గంట 31 నిమిషాల వరకు కొనసా గింది. సుమారు మూడున్నర గంటల పాటు ఈ గ్రహణం వీక్షించేందుకు అవకాశం కలిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా బ్లడ్ మూన్ దృశ్యంపై ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. 

Chandra Grahanam: వచ్చే నెల 7న ఆకాశంలో అద్భుతం.

ఈ నెల 7వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. గడిచిన దశాబ్ద కాలంలోనే అత్యంత ప్రకాశవంతమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 8:58 గంటలకు మొదలై 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడి, తెల్లవారుజామున 2:25 గంటలకు గ్రహణం విడవనుంది. నార్త్, సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా దేశాల ప్రజలు నేరుగా గ్రహణాన్ని చూడొచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఆకాశం మేఘావృతమై ఉండకపోతే కనుక, డాబాపైకి ఎక్కి ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు. టెలీస్కోప్ కానీ, బైనాక్యులర్ కానీ అందుబాటులో ఉంటే గ్రహణాన్ని మరింత చక్కగా చూడవచ్చని తెలిపారు. రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని వివరించారు.

GOVERNER: రుషికొండ ప్యాలెస్‌ను పిచ్చి ఆసుపత్రిగా మార్చాలి: గవర్నర్

ప్ర­జా­ధ­నం­తో ని­ర్మిం­చిన రు­షి­కొండ ప్యా­లె­స్‌­ను మా­న­సిక వై­ద్య­శా­ల­గా మా­ర్చా­ల­ని గోవా గవ­ర్న­ర్‌ పూ­స­పా­టి అశో­క్‌­గ­జ­ప­తి­రా­జు సలహా ఇచ్చా­రు. క్ష­త్రియ సే­వా­స­మి­తి ఆధ్వ­ర్యం­లో వి­శా­ఖ­లో సన్మాన సభ ఏర్పా­టు చే­శా­రు.‘‘అల్లూ­రి వి­గ్ర­హా­న్ని ఆవి­ష్క­రిం­చు­కు­న్నాం.. ఆయ­న్ను స్ఫూ­ర్తి­గా తీ­సు­కో­వా­లి. చాలా ఏళ్లు ప్ర­భు­త్వం­లో మం­త్రి­గా పని­చే­శా­ను. అప్పు­డు సం­క్షే­మం కోసం అప్పు­లు చే­సే­వా­రు. కానీ, గత ప్ర­భు­త్వం­లో అన్ని తా­క­ట్టు­లో పె­ట్ట­డం చూశా. వి­శా­ఖ­లో ప్ర­జా­ధ­నం­తో కట్టిన రు­షి­కొండ ప్యా­లె­స్‌ పె­చ్చు­లు ఊడి­పో­యా­య­ని తె­లి­సిం­ది. అదే రూ.600 కో­ట్లు ఉంటే ఉత్త­రాం­ధ్ర సుజల స్ర­వం­తి పూ­ర్త­య్యే­ది. ఈ ప్యా­లె­స్‌­ను ఏం చే­యా­ల­ని ప్ర­భు­త్వం ప్ర­జ­ల­ను అడు­గు­తోం­ది. దా­ని­ని పి­చ్చి ఆసు­ప­త్రి చే­స్తే మం­చి­ద­ని నా ఉచిత సలహా. కనీ­సం దా­ని­ని కట్టిన దు­ర్మా­ర్గు­ల­కి ఆ సము­ద్ర గాలి తగు­లు­తుం­ది. ఆ భవ­నాల ద్వా­రా ఎలాం­టి ఆదా­యం రాదు. ప్ర­జా­ధ­నా­న్ని ప్ర­జా హితం కోసం వా­డా­లి. మన అం­ద­రి­నీ ఇబ్బం­ది పె­ట్టా­రు. మనో ధై­ర్యం­తో ని­ల­బ­డా­లి.. లొం­గి­పో­కూ­డ­దు. మన వీర సై­ని­కు­లు ప్ర­పం­చా­ని­కి మన సత్తా చూ­పిం­చా­రు. అన్ని దే­శా­ల­కు ఒక పాఠం నే­ర్పిం­చాం’’ అని అశో­క్‌­గ­జ­ప­తి­రా­జు అన్నా­రు.

కైలాసగిరిపై సిద్ధమైన గాజు వంతెన

వి­శా­ఖ­లో మరి­కొ­ద్ది రో­జు­ల్లో గాజు వం­తెన పర్యా­ట­కు­ల­కు థ్రి­ల్ పం­చ­నుం­ది. మహా వి­శాఖ ప్రాంత నగ­రా­భి­వృ­ద్ధి సం­స్థ ఆధ్వ­ర్యం­లో కై­లా­స­గి­రి­పై 55 మీ­ట­ర్లు పొ­డ­వు కలి­గిన గాజు వం­తెన ని­ర్మా­ణం పూ­ర్త­యిం­ది. ఇది దే­శం­లో­నే అతి పొ­డ­వై­న­ది. ఒకే­సా­రి 100 మంది ని­ల­బ­డే సా­మ­ర్థ్యం­తో దీ­ని­ని ని­ర్మిం­చి­నా.. భద్రత దృ­ష్ట్యా ఒక­సా­రి­కి కే­వ­లం 40 మం­ది­కి మా­త్ర­మే అను­మ­తి­స్తా­రు. దీ­ని­పై­కి ఎక్కి­చూ­స్తే చు­ట్టూ ఎత్త­యిన కొం­డ­లు, కిం­ది భా­గం­లో లోయ, కను­చూ­పు మే­ర­లో సా­గ­రం కని­పి­స్తా­యి. గా­ల్లో తే­లి­యా­డు­తు­న్న­ట్లు, కొ­త్త లో­కం­లో వి­హ­రి­స్తు­న్న భావన పర్యా­ట­కు­ల­కు కలు­గు­తుం­ద­ని అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు.

లిక్కర్ కేసులో సిట్ దూకుడు

ఏపీ మద్యం కే­సు­లో సి­ట్‌ దర్యా­ప్తు కొ­న­సా­గు­తోం­ది. వై­సీ­పీ నేత వి­జ­యా­నం­ద­రె­డ్డి ఇళ్లు, కం­పె­నీ­ల్లో సి­ట్‌ తని­ఖీ­లు చే­సిం­ది. చి­త్తూ­రు బీ­వీ­రె­డ్డి కా­ల­నీ­లో, నలం­దా­న­గ­ర్‌­లో­ని ని­ఖి­లా­నంద అపా­ర్టు­మెం­ట్‌­లో అధి­కా­రు­లు సో­దా­లు చే­శా­రు. వి­జ­యా­నం­ద­రె­డ్డి 2024లో వై­సీ­పీ తర­ఫున పో­టీ­చే­సి ఓడి­పో­యా­రు. ఆయ­న్ను రెం­డ్రో­జుల క్రి­తం వి­జ­య­వాడ సి­ట్‌ కా­ర్యా­ల­యా­ని­కి పి­లి­చి వి­చా­రిం­చా­రు. వి­జ­యా­నం­ద­రె­డ్డి ఇంటి అడ్ర­స్సు­తో సీ­బీ­ఆ­ర్‌ ఇన్‌­ఫ్రా కం­పె­నీ ఉం­డ­టం­పై అధి­కా­రు­లు ఆరా తీ­స్తు­న్నా­రు. వై­సీ­పీ నేత చె­వి­రె­డ్డి రె­డ్డి భా­స్క­ర్ రె­డ్డి, ఆయన కు­మా­రు­డు మో­హి­త్ రె­డ్డి­కి చెం­దిన ఇన్ ఫ్రా కం­పె­నీ­ల్లో సో­దా­లు ని­ర్వ­హిం­చా­రు. అధి­కా­రు­లు చి­త్తూ­రు వె­ళ్లి ఆయా కం­పె­నీ­ల్లో తని­ఖీ­లు చే­శా­రు. ఇప్ప­టి­కే పలు రి­కా­ర్డు­ల­ను పరి­శీ­లి­స్తు­న్నా­రు. మద్యం ము­డు­పు­ల­ను కం­పె­నీ­ల్లో­కి మళ్లిం­చి­న­ట్లు­గా అధి­కా­రు­ల­కు సమా­చా­రం అం­ద­డం­తో ఈ సో­దా­లు చే­ప­ట్టా­రు. దీం­తో ఆయా కం­పె­నీ­ల్లో అధి­కా­రుల తని­ఖీ­లు ఒక్క­సా­రి­గా కల­క­లం రే­పా­యి. సమా­చా­రం తె­లు­సు­కు­న్న చి­త్తూ­రు వై­సీ­పీ శ్రే­ణు­లు ఆయా కం­పె­నీల వద్ద­కు భా­రీ­గా చే­రు­కుం­టు­న్నా­రు. సిట్ చర్య­ల­ను వ్య­తి­రే­కి­స్తు­న్నా­రు. సిట్ ను అడ్డు­పె­ట్టు­కు­ని ప్ర­భు­త్వం కక్ష సా­ధిం­పు­ల­కు పా­ల్ప­డు­తోం­ద­ని వ్యా­ఖ్యా­ని­స్తు­న్నా­రు. వి­రె­డ్డి భా­స్క­ర్‌­రె­డ్డి­కి సం­బం­ధిం­చి హై­ద­రా­బా­ద్‌­లో­నూ సి­ట్‌ తని­ఖీ­లు సా­గు­తు­న్నా­యి. తి­రు­ప­తి­లో ఆయ­న­కు చెం­దిన రి­య­ల్ ఎస్టే­ట్ కా­ర్యా­ల­యం­లో, తి­రు­ప­తి గ్రా­మీణ మం­డ­లం­లో­ని ఇం­ట్లో అధి­కా­రు­లు సో­దా­లు చే­స్తు­న్నా­రు. ఈ తనిఖీల తర్వాత సిట్ కీలక నేతలను అరెస్ట్ చేస్ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Ramlal old age home: అద్దెకు అమ్మమ్మ తాతయ్యలు..

ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిల్లలకు తాత, నానమ్మ, అమ్మమ్మల ఆప్యాయత, అనుబంధం దూరమవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రాలోని "రామ్‌లాల్ వృద్ధాశ్రమం" వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అద్దెకు తాతయ్య, అమ్మమ్మ' అనే సరికొత్త సర్వీసు ప్రారంభించింది. దీని ద్వారా అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారికి కుటుంబంతో ఉండే అనుభూతిని అందిస్తుంది.

ఈ కార్యక్రమం కింద వృద్ధాశ్రమంలోని వృద్ధులను నెల రోజుల పాటు కుటుంబాలు తమతో పాటు ఉంచుకోవచ్చు. దీని కోసం కుటుంబాలు రూ.11వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన మొత్తంలో సగం అద్దెకు వెళ్లిన వృద్ధుడికి, మిగిలిన సగం ఆశ్రమానికి కేటాయిస్తారు. ఇలా అద్దెకు వెళ్లే వృద్ధులకు కొంత ఆర్థిక సహాయం లభించడమే కాకుండా, వారు కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతిని పొందుతారు. ఇది వారికి ఒంటరితనం నుంచి ఉపశమనం ఇస్తుంది. అటు వైపు, ఈ కార్యక్రమం వల్ల పిల్లలకు తాతలు, నాయనమ్మల ప్రేమ, కథలు, అనుభవాలు తెలియజేయడం జరుగుతుంది. ఇది జనరేషన్ మధ్య గ్యాప్ ఫిల్, చేయడానికి యువతలో పెద్దల పట్ల గౌరవాన్ని, సానుభూతిని పెంచుతుంది. ఈ సిస్టమ్ జపాన్‌లో ఉండటాన్ని చూసి.. తాము కూడా ప్రారంభించామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశంలో వృద్ధులకు మద్దతు ఇచ్చే వ్యవస్థపై మరింత చర్చను లేవనెత్తుతుంది.

LPG Price Reduction: భారీగా తగ్గిన ఎల్‌పీజి గ్యాస్ సిలిండర్ల ధర..

వినియోగదారులకు గుడ్ న్యూస్. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) ఈరోజు నుంచి వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరను 51.50 రూపాయలు తగ్గించాయి. సవరణ తర్వాత, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రూ. 1,580 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. అయితే, 14.2 కిలోల గృహోపకరణాల ఎల్‌పిజి సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదని కంపెనీలు తెలిపాయి. తాజా నెలవారీ సవరణ తర్వాత ధరల తగ్గింపు దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల సర్దుబాటు ఈ LPG సిలిండర్లను రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, మార్కెట్ పరిస్థితుల ప్రకారం ప్రతి నెలా గ్యాస్ ధరలు నిర్ణయించబడతాయి.

Medical Prescription: మందుల చీటీ అర్థమయ్యేలా ఉండాలి..

చికిత్సలో భాగంగా వైద్యులు ఇచ్చే మందుల చీటీ కచ్చితంగా అర్థమయ్యేలా ఉండాలని, స్పష్టమైన వైద్య ప్రిస్క్రిప్షన్‌, రోగ నిర్ధారణలు పొందడం రోగి హక్కని పంజాబ్‌, హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగబద్ధమైన ఆరోగ్య హక్కులలో ఇది ఉందని స్పష్టం చేసింది. ‘మందుల చీటీ, రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య పత్రాలు, అందుతున్న చికిత్స గురించి తెలుసుకునే హక్కు ప్రతి రోగికి ఉంది.దీంతో ఆ డాక్యుమెంట్లు స్పష్టమైన రాతలో ఉండాలి. అందులోని విషయం రోగికి స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి’ అని జస్టిస్‌ జస్గురుప్రీత్‌ ఈనెల 27న తీర్పు చెప్పారు. ఒక కేసులో మెడికో లీగల్‌ నివేదిక అర్థం కాని రాతలో ఉండటంతో కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారించింది.

SAD: మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదం

అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి, సినీ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) వృద్ధాప్య కారణంగా అర్థరాత్రి కన్నుమూశారు. మధ్యాహ్నం కోకాపేలో అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్‌చరణ్ మైసూర్ నుంచి, బన్నీ ముంబై నుంచి చేరుకోనున్నారు. అరవింద్, చిరంజీవి అంత్యక్రియలు నిర్వర్తిస్తుండగా, పవన్ కళ్యాణ్, నాగబాబు రేపు విచ్చేసి కుటుంబానికి సంతాపం తెలియజేయనున్నారు. కనకరత్నమ్మ, రామ్‌చరణ్‌కు అమ్మమ్మ అవుతుంది. రాంచరణ్ మైసూర్ నుంచి , బన్నీ ముంబై నుంచి మధ్యాహ్ననికి హైదరాబాద్‌ చేరుకొంటారు . అల్లు అరవింద్, చిరంజీవి ఇప్పటికే భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పవన్ నాగబాబులు వైజాగ్ లో జరగనున్న పబ్లిక్ మీటింగ్ లో ఉన్నందున రేపు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలుపుతారు.

KADAPA: కడప శ్మశానంలో రిజర్వ్‌డ్ బోర్డులు

మని­షి జీ­వి­తం రె­ప్ప పాటే అనే ధర్మా­ని­కి కడ­ప­లో స్మ­శా­నం­లో ఏర్పా­టు చే­సిన రి­జ­ర్వ్‌­డ్ బో­ర్డు­లు సా­క్ష్యం­గా ని­లు­స్తు­న్నా­యి. భా­ర్య చని­పో­తే భర్త తమ­వా­రి సమా­ధి ని­ర్మిం­చి పక్క­నే తమ సమా­ధి­కి అవ­స­ర­మైన స్థ­లా­న్ని ముం­దు­గా­నే రి­జ­ర్వు చే­సు­కుం­టు­న్నా­రు. మర­ణా­నం­త­రం మట్టి­లో కలి­సి­నా పక్క­నే ఉం­డా­ల­ని ఇలా చే­స్తు­న్నా­రట. కడప రి­మ్స్‌ సమీ­పం­లో­ని క్రై­స్త­వుల సమా­ధి తో­ట­లో రి­జ­ర్వు చే­సిన ప్రాం­తా­ల్లో బో­ర్డు­లు పా­తా­రు. దీ­ని­పై ఒక్కొ­క్క­రు ఒక్కో­లా చర్చిం­చు­కుం­టు­న్నా­రు.

Zelensky:  భారత్ లో పర్యటించనున్న జెలెన్ స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ త్వరలో భారత్ లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌ చుక్ తెలిపారు. జెలెన్ స్కీ పర్యటనకు సంబంధించి తేదీలను ఖరారు చేయడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతేడాది ఆగస్టులో కీవ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని భారత్ కు ఆహ్వానించారు.

ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రధాని మోదీ ఒత్తిడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం వాదిస్తూ “ఇది యుద్ధ యుగం కాదు” అని నొక్కి చెప్పారు. పుతిన్, జెలెన్ స్కీలతో టెలిఫోన్ సంభాషణలు జరిపారు. భారతదేశం రెండు దేశాల మధ్య శాంతిని కోరుకుంటుందని వెల్లడించారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఏడాది చివరలో భారత్‌ కు రానున్నారు.

Nandamuri Padmaja : నందమూరి కుటుంబంలో విషాదం..

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు సోదరి కావడంతో, దగ్గుబాటి కుటుంబంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతితో నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

NANDAMURI: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె కాసేపటి క్రితం కన్నుమూశారు. నందమూరి పద్మజ..మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి. అంత్యక్రియలపై నందమూరి కుటుంబం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులే లక్ష్యంగా మందుపాతర..

ఛత్తీస్‌గఢ్‌లోని  బీజాపూర్‌ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో ఓ జవాను మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్‌ జిల్లాలోని భోపాల్‌పట్నం పరిధి ఉల్లూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. సోమవారం తెల్లవారుజామున జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ జవాన్లు ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌లో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉల్లూరు సమీపంలో ఏర్పాటు చేసిన మందుపాతర ని మావోయిస్టులు పేల్చారు. దీంతో డీఆర్‌జీ జవాన్‌ దినేశ్‌ నాగ్‌ అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని దవాఖానకు తరలించారు. ఈమేరకు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

New York Explosion: న్యూయార్క్‌లో భారీ పేలుడు..

 న్యూయార్క్ నగరంలోని అప్‌పర్ ఈస్ట్ సైడ్‌ శుక్రవారం ఉదయం పెద్ద పేలుడు ధాటికి కుదేలైంది. ఈ ఘటనలో మాన్‌హాటన్‌ పక్క ప్రాంతం మొత్తాన్ని దట్టమైన నల్ల పొగ కప్పేసింది. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఈస్ట్ 95వ స్ట్రీట్‌, 2వ అవెన్యూ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు చోటుచేసుకుంది. దీని తర్వాత అక్కడే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం ప్రారంభించాయి. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు తీవ్రత కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని నియంత్రించడానికి భద్రతా చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Plane Crash : ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం..

అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న ఓ చిన్న విమానం.. ఆగి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. సోకాటా టీబీఎం 700 టర్బోప్రాప్ విమానం అప్పటికే ఆగి ఉన్న ప్రయాణికులు లేని విమానాన్ని ఢీకొట్టిందని అధికారులు చెప్పారు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ కమ్మేసిందని తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న పైలట్‌, ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. అయితే ఇద్దరు ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని, వారికి ఎయిర్‌పోర్టులోనే వారికి చికిత్స అందించామని వెల్లడించారు. ఆ విమానాన్ని 2011లో తయారు చేశారని పేర్కొన్నారు.

Ecuador Shooting: ఈక్వెడార్‌లో కాల్పులు.. 8 మంది మృతి

ఆఫ్రికా దేశమైన ఈక్వెడార్‌లో కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. నైట్‌క్లబ్‌ వద్ద ఆదివారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. గయా ప్రావిన్స్‌లోని శాంటా లూసియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీన్ని ఈక్వెడార్‌లోనే అత్యంత భయంకర ప్రాంతంగా పేర్కొంటారు. బాధితులందరూ 20 నుంచి 40 ఏళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాలపై వచ్చిన సాయుధులైన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పరారయ్యారని అక్కడి మీడియా పేర్కొంది. ఇటీవల కాలంలో ఈక్వెడార్‌లో వరుస అల్లర్లు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటనకు కారణాలు మాత్రం తెలియరాలేదు. మొత్తం 1.8 కోట్ల జనాభా ఉన్న ఈక్వెడార్‌లో ఈ ఏడాదిలో మొత్తం 4600 మంది అల్లర్లలో చనిపోయారు. గతేడాది 7,000 మంది చనిపోయారు. 

CRPF:  ప్రమాదానికి గురైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల వాహనం..

 జమ్ము కశ్మీర్‌ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదంపూర్‌  జిల్లా కద్వా బసంత్‌గఢ్‌   ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. సుమారు 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఉదంపూర్‌ అడిషనల్‌ ఎస్పీ సందీప్‌ భట్‌ తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో 23 మంది జవాన్లు ఉన్నట్లు చెప్పారు.

Operation Akhal: మూడో రోజు  ఆపరేషన్‌ అఖల్‌.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల అంతుచూసేందుకునే భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ అఖల్‌ (Operation Akhal) మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు. ఓ జవాన్‌ గాయపడ్డారు. ఆపరేషన్‌ అఖల్‌ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కుల్గాం జిల్లాలోని అఖల్‌ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు ఆగస్టు 1న గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య శనివారం రోజంతా కాల్పులు కొనసాగాయాయి. ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరోవైపు ముష్కరుల కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ గాయపడ్డారు. మృతులు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు (TRF) చెందినవారని అధికారులు తెలిపారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి టీఆర్‌ఎఫ్‌ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు.

Anil Ambani: అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

రిల‌య‌న్స్ గ్రూప్ ఛైర్మ‌న్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. రూ. 17వేల కోట్ల విలువైన రుణాల మోసానికి సంబంధించిన కేసులో చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన ఈడీ.. ఆయ‌న‌కు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. కాగా, జులై 24న అనిల్ అంబానీకి చెందిన మొత్తం 50 కంపెనీలు, 25 మంది వ్యాపార భాగ‌స్వాముల ఇళ్లు, అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ల‌కు సంబంధించిన 35కు పైగా కార్యాల‌యాల్లో ఈడీ ఆక‌స్మిక సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ప్రివెన్ష‌న్ ఆఫ్ మ‌నీలాండ‌రింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద మూడు రోజుల పాటు నిర్వ‌హించిన ఈ త‌నిఖీల్లో కీల‌క డాక్యుమెంట్ల‌తో పాటు హార్డ్ డిస్క్‌ల‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Commercial LPG: మరోసారి తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర..

వాణిజ్య అవసారలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధర  మరోసారి తగ్గింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్‌ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్‌ కంపెనీలు.. తాజాగా వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.33.50 తగ్గించాయి. తగ్గిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. తగ్గించిన ధరతో ఢిల్లీలో రూ.1665గా వాణిజ్య సిలిండర్‌ రూ.1631.50గా ఉంది. కోల్‌కతాలో రూ.1735.50, ముంబైలో రూ.1616.50, చెన్నై రూ.1790 కు తగ్గింది. రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది.

ఇక గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో రూ.853గా ఉండగా, కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50, హైదరాబాద్‌లో రూ.905గా ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.50 పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

Yogi Adityanath:అత్యధిక కాలం యూపీకి సీఎంగా పనిచేసిన వ్యక్తిగా యోగి  రికార్డ్..

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృ‌ష్టించారు. యూపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు ఈ పదవిలో ఉన్నారు, కొనసాగుతున్నారు. అంతకు ముందు ఉన్న గోవింద్ వల్లభ్ పంత్ రికార్డును యోగి అధిగమించారు. పంత్ యూపీకి ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల 127 రోజులను యోగి అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ మొదట మార్చి 19, 2017న ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌లో వరసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రికార్డు కూడా యోగి, బీజేపీ పార్టీకి ఉంది. తన పాలనలో మాఫియా డాన్‌లు, నేరస్తులను అణిచివేయడంతో యోగి మార్క్ కనిపించింది.

Ashok Gajapathi Raju :  గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ప్రమాణం..

 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతి రాజు గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్‌ బంగ్లా దర్బార్‌ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌తోపాటు టీడీపీ ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. ఈనెల 14న గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతి రాజు నియమితులైన విషయం తెలిసిందే. పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై స్థానంలో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అశోక్‌ 2014 నుంచి 2018 వరకు మోదీ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా వ్యవహరించారు.