చిట్టి న్యూస్

ప్రార్థనతో రోజును ప్రారంభించండి..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

మీరు మీ ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తారు... ఒక్కక్కరు ఒక్కో విదంగా దినచర్యను ప్రారంభిస్తారు. కొందరు జిమ్‌కి వెళ్లడానికి ఇష్టపడతారు, మరికొందరు ఉదయం లేవగానే వరండాలో కూర్చుని ఒక కప్పు వేడి కాఫీ లేదా టీని సిప్ చేస్తూ ప్రారంభిస్తారు. అయితే రోజును ప్రార్థనతో ప్రారంభించాలని అంటున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. దానికి కారణం చెప్తూ మనల్ని చూసుకునేవాడు ఆయనే(దేవుడు) కదా అంటూ" ప్రార్థనతో రోజును ప్రారంభించండి "అనే క్యాప్షన్‌తో ఇన్ స్టాగ్రామ్ లో సెల్ఫీని పంచుకున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.

మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా పెన్షన్ డ్రా

మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు పెన్షన్ డ్రా చేసుకుంటున్నాడు. పల్నాడు జిల్లా దొడ్లేరుకు చెందిన కిరీటి 20 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. 

తీర్పు దిక్కరించారని రెండు కుటుంబాలను వెలివేసిన పెద్దలు

భూ వివాదంలో తమ తీర్పును ధిక్కరించారన్న నెపంతో రెండు కుటుంబాలను గ్రామ పెద్దలు ఊరి నుంచి వెలివేశారు. కృష్ణా జిల్లా వెంకటాపురం పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

భువనగిరిలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

యాదాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. కొయ్యలగూడెంలో హ్యాండ్లూమ్‌ మోడ్రన్‌ సేల్స్‌ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.

జమ్ముకశ్మీర్‌ శారదా ఆలయాన్ని సందర్శించిన శృంగేరి శంకరాచార్యులు

జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని తీత్వాల్‌లో శారదా ఆలయాన్ని శృంగేరి శంకరాచార్యులు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు తీత్వాల్‌లో శంకరాచార్యులకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శారదా కమిటీని కాపాడేందుకు శంకరాచార్య కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: అద్దంకి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. కేసీఆర్ పాలన అంతా అవినీతి మయం అని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైన్, సాండ్, ల్యాండ్, మైనింగ్ లలో దొరికిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రికార్డు స్థాయిలో పన్నెండు అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుంటాంమని ధీమా వ్యక్తం చేసారు. తుంగతుర్తిలో తన గెలుపును ఎవరూ అడ్డకోలేరంటున్నారు అద్దంకి దయాకర్. 

బిల్లులు ఎలాగొ మంజూరు చేయట్లే..చావడానికైనా అనుమతివ్వండి

గుంటూరు జిల్లాల్లో పెండింగ్‌ బిల్లుల కోసం ఓ కాంట్రాక్టర్‌ కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. హర్టీ కల్చర్ కమిషనర్ శ్రీధర్ బిల్లులు మంజూరు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని భాధితుడు హరికిషన్‌ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి చేతులెత్తి మొక్కాడు బాధితుడు.

హరికిషన్‌... వ్యవసాయశాఖకు మూడు ఎలక్ట్రిక్ ఆటోలను సప్లయ్ చేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు 11లక్షల వరకు హరికిషన్‌కు రావాల్సి ఉంది. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన హరికిషన్.. కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. తనకు రావాల్సిన 11 లక్షల రూపాయల బకాయిలు ఇప్పించకుంటే.. మరణమే శరణ్యమని వాపోయారు. నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ చెప్పినా.. హార్టీకల్చర్‌ కమిషనర్ శ్రీధర్ బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు.

పోలవరం బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలో ముంపు

పోలవరం వెనక జలాలతో తెలంగాణ భూభాగంలో ముంపు ఏర్పడుతోందని, ఉమ్మడి సర్వే చేపట్టి ముంపు పరిధిని గుర్తించే వరకు నీటిని నిల్వ చేయవద్దని ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ కోరింది.

ఒరిస్సా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ

కోరమాండల్‌ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. సీబీఐ సమగ్ర విచారణ జరుపుతుందన్నారు.

వారిని చంద్రబాబు కలిస్తే తప్పేంటి: బండి

అమిత్ షా, జేపీ నడ్డాను.. చంద్రబాబు కలిస్తే తప్పేంటన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనేది ఊహగానాలే అని తేల్చిచెప్పారు.

కుప్పకూలిన బ్రిడ్జ్

బీహార్‌లోని ఖగారియాలో గంగా నదిపైన నిర్మిస్తున్న నాలుగు లేన్ల బ్రిడ్జి కుప్పకూలింది. వంతెన కూలిపోతుండగా స్థానికులు ఫోన్లలో తీసిన వీడియో వైరలైంది.


ఆ రైలులో తమిళులు ఎవరూ లేరు

ఒడిశా రైలు ప్రమాదంలో తమిళులు ఎవరూ చనిపోలేదన్నారు మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్ కాలేదన్నారు. అన్ని ఆసుపత్రులను పరిశీలించామన్నారు.

రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి

ఒడిశా రైలు ప్రమాద స్థలంలో ఓ ట్రాక్‌పై పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. దీంతో ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.


Telangana: నేటి నుంచి రేషన్ డీలర్ల సమ్మె

తెలంగాణలో రేషన్‌ డీలర్ల  సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు గౌరవ వేతనం ఇవ్వాలని, హమాలీ ఛార్జీలు భరించాలని డిమాండ్‌ చేశారు. ఇక 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. డీలర్ల సమ్మెతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ పంపిణీ నిలిచిపోనుంది.

కందుకూరు వైసీపీలో వర్గపోరు

కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు  వైసీపీలో వర్గపోరు నడుస్తుంది. వైసీపీ పార్టీకి చెందిన ఇరు వర్గాలు కత్తులు కర్రలతో ఘర్షణకు దిగారు. గత నాలుగు సంవత్సరాల నుండి బెట్టన్న గౌడ్, రాజోలి బండ భీమారెడ్డి వర్గీయులకు పచ్చగడ్డి వేస్తే భగ్గమన్నట్లు ఘర్షణలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఎదుర్కొన లేకనే మాపై దాడులకు దిగారంటూ ఆరోపిస్తున్నారు భీమారెడ్డి వర్గీయులు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇరు వైసీపీ వర్గీయులను ఆదోని ఆస్పత్రికి తరలించారు.

Telangana: రైతులకు ప్రభుత్వం ఎంతో గౌరవం తెచ్చిందది: ఎమ్మెల్సీ కవిత

రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో గౌరవం తెచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ద‌శాబ్ది వేడుక‌ల్లో భాగంగా స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం ప‌ద్మాజివాడ‌లో నిర్వహించిన రైతు దినోత్సవంలో పాల్గొన్న కవిత... ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూశామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మిష‌న్ కాక‌తీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నామ‌ని.. దీంతో భూగ‌ర్భ జ‌లాలు కూడా పెరిగాయ‌న్నారు. ఇక కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామ‌ని చెప్పారు. వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింద‌న్నారు కవిత.

విశాఖ నుంచి ఒడిశాకు వెళ్లిన వైద్య సిబ్బంది

విశాఖ నుంచి ఒడిశాకు డీఆర్ఎం స్పెషల్ ట్రైన్‌ బయల్దేరింది. వైద్య సిబ్బందితో బయల్దేరిన ఈ ట్రైన్.. ఏడుగంట్లో ప్రమాద స్థలానికి చేరుకుంటుంది. ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ అలెర్ట్‌ అయ్యిందని విశాఖ స్టేషన్ డైరక్టర్‌ వెంకటరాజు అన్నారు. విశాఖ నుచి వైద్య సిబ్బంది, సహాయక పరికరాలు పంపించామంటున్నారు.

లోకేష్‌కు ప్రాణహాని

యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌కు రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో ప్రాణహాని ఉందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయన్నారు వర్ల రామయ్య. రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో లోకేష్ కు ప్రాణహాని ఉందని, అనేకమార్లు డీజీపీ దృష్టికి తీసుకొచ్చామని గుర్తు చేసారు. సంబంధిత అధికారుల ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసారు వర్ల రామయ్య.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు

తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి. వ్యవసాయాన్ని పండగలా చేయాలన్న నినాదంతో, సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ, దశాబ్ధి ఉత్సవాల్లో, మొట్టమెదటి రోజు రైతు దినోత్సవాన్ని జరుపుకున్నామన్నారు శాంత కుమారి. అకాల వర్షాలు వడగళ్ల వాన నుండి పంట నష్టపడకుండా, ఉండాలంటే రైతులు రెండు మూడు వారాల ముందే నార్లు వేయాలన్నారు. ఎరువులను దఫ దపాలుగా వాడితే అధిక దిగుబడి వస్తుందన్నారు శాంత కుమారి.

నిలిచిపోయిన 17 రైల్లు

ఒడిశా ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈస్ట్‌ కోస్ట్‌లో 17 ట్రైన్స్‌ నిలిచిపోయాయి. 11 రైళ్లను దారి మళ్లించారు. ఇందులో విజయనగరం మీదుగా ప్రయాణించే నాలుగు ట్రైన్స్‌తో పాటు మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయనగరం జిల్లా గుండా ప్రయాణించడంతో స్థానిక రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. 

ఒడిశాలో రైలు ప్రమాదం

కోల్‌కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టింది.దీంతో ఇంజిన్‌తో పాటు 12 బోగీలు పక్క ట్రాక్‌పై ఒరిగిపోయాయి. ఇదే సమయంలో ఆ ట్రాక్‌పై యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు జనరల్‌ బోగీలు ధ్వంసం అయ్యాయి. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌లు ధ్వంసం అయ్యాయి. ఇంజిన్‌తో పాటు పట్టాలు తప్పిన B1 బోగీ. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. 

తెలంగాణ భవన్‌ ఆవరణలో యువతి ఆత్మహత్యాయత్నం