మొదలైన మోదీ సర్కారు రెండో విడత పాలన

By - TV5 Telugu |31 May 2019 3:25 PM GMT
కేంద్రంలో మోదీ సర్కారు రెండో విడత పాలన మొదలైంది. పలువురు కేంద్ర మంత్రులు తొలిరోజే బాధ్యతలు స్వీకరించారు. ఉదయమే తమ శాఖల కార్యాలయాలకు చేరుకున్న మంత్రులు నిరాండంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వీరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు… కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, జితేంద్ర సింగ్, ప్రహ్లాద్ జోషి, శ్రీపాద యశోనాయక్, ప్రకాశ్ జావ్డేకర్, రమేష్ పోక్రియాల్ ఉన్నారు.
Tags
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com