ఆమె తప్ప నన్నెవరూ పట్టించుకోలేదు..అందుకే గెలిచారు
ప్రముఖ గాయని ఆశా భోస్లే ..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ప్రశంసలు కురిపించారు. తనకు ఎదురైన ఓ సంఘటనలో స్మృతి ఇరానీ స్పందించిన తీరును గుర్తుచేసుకుంటూ ట్విటర్ వేదికగా ఆమెపై తనకు ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. ‘ ప్రధాని పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నేను ట్రాఫిక్లో చిక్కుకుపోయాను. ఆ రద్దీ నుంచి బయటపడడానికి నాకు ఎవరూ సహాయం చేయలేదు. ఆ జనంలో నా ఇబ్బందిని గమనించిన స్మృతి.. అక్కడి నుంచి నేను ఇంటికి క్షేమంగా చేరుకునే వరకు ఆమె మనసు కుదుటపడలేదు. తన మనసు అలాంటిది మరి..ఆమె అందరినీ అంతలా అభిమానిస్తుంది. అందుకే గెలిచింది’ అంటూ ట్విటర్ పోస్ట్లో పేర్కొంది. తన గురించి అంతలా పరితపించిన ఆమెను గుర్తుచేసుకుంటూ ట్విటర్ వేదికగా అభిమానం చాటుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించి అమేథీ ఎంపీగా గెలుపొందిన స్మృతికి మోది తన మంత్రి వర్గంలో మరోసారి అవకాశం కల్పించారు. పిన్న వయస్కురాలైన మంత్రిగా కేబినెట్లో చోటుదక్కించుకుని చరిత్రకెక్కారు. గురువారం నరేంద్ర మోదీతో పాటు మంత్రివర్గంలో చోటు దక్కిన నాయకులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి విశిష్ట అతిథులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com