మురళీమోహన్ను పరామర్శించిన చిరంజీవి దంపతులు

X
By - TV5 Telugu |1 Jun 2019 12:55 PM IST
ప్రముఖ సీనియర్ నటుడు, రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మే 14న వారణాసిలో తన తల్లి అస్తికలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వెన్నముకకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు వెంటనే వెన్నముక శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. వారం రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మురళీమోహన్.. ప్రస్తుతం తన నివాసంలో కోలుకుంటున్నారు. మురళీమోహన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి దంపతులు.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com