టపాసుగా భావించి నాటు బాంబుకు నిప్పు పెట్టిన చిన్నారులు..

టపాసుగా భావించి నాటు బాంబుకు నిప్పు పెట్టిన చిన్నారులు..

గుంటూరు జిల్లాలో నాటు బాంబు పేలి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఇద్దరు అబ్బాయిలకు బాంబు కనిపించింది. టపాసుగా భావించిన వారు దానికి నిప్పు పెట్టారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. చిన్నారుల కడుపులోకి గాజుపెంకులు దూసుకెళ్లటంతో గాయాలయ్యాయి. చిన్నారులు ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story