తాగిన మత్తులో బిడ్డపైనే పడుకున్న తల్లి..చివరకు ఆ బిడ్డ...

తాగిన మత్తులో బిడ్డపైనే పడుకున్న తల్లి..చివరకు ఆ బిడ్డ...

మత్తు వదిలాక ఆ తల్లికి అర్థమైంది తానెంత దుర్మార్గమైన పనికి ఒడిగట్టానో అని. ఊపిరి ఆడక బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి తల్లి మనసు తల్లడిల్లింది. గుండెలవిసేలా రోదించింది. యూకేలోని మిడ్‌వేల్స్‌కు చెందిన మరీనా టిల్బే తన సోదరితో కలిసి నైట్ క్లబ్‌కి వెళ్లింది. తన నాలుగు వారాల చంటి బిడ్డని కూడా చంకనేసుకుని వెళ్లింది. అక్కడ ఆమెకు ఇద్దరు యువకులు పరిచయం అయ్యారు. వారితో పాటు ఫుల్లుగా మందుకొట్టింది టిల్బే. బిడ్డని యువకులు ఉంటున్న కారవ్యాన్ (ఇల్లులానే ఉండే వాహనం)లో పడుకోబెట్టింది. ఆట, పాట పూర్తయిన తరువాత మత్తులో ఉన్న ఆమె కూడా వచ్చి కారవ్యాన్‌లో పడుకుంది. బిడ్డమీద పడుకున్నానన్న ధ్యాస లేకుండా మత్తుగా నిద్ర పోయింది. ఈలోపు బిడ్డ కోసమని టిల్బే సోదరి కారవ్యాన్ అంతా వెతుకుతోంది. చివరికి టిల్బేను లేపి అడిగింది. మత్తు వదిలిన ఆమె హఠాత్తుగా లేచి కూర్చుంది. ఆమె కిందే బిడ్డ ఉన్నాడన్న విషయాన్ని గుర్తించింది. బిడ్డ ముక్కులో నుంచి రక్తం కారుతూ నిర్జీవంగా పడి ఉన్నాడు. భోరుమని విలపిస్తూ బిడ్డని తీసుకుని ఆసుపత్రికి పరిగెట్టారు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ. అయితే అప్పటికే చిన్నారి గుండె ఆగిపోయిందని డాక్టర్లు వివరించారు. కన్నబిడ్డపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టిల్బేని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు రెండేళ్ల నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.

Tags

Read MoreRead Less
Next Story