చేప ప్రసాదం .. రెండు లక్షల చేపలను..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ నేటితో ముగియనుంది.ఈ సాయంత్రం ఆరు గంటల వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. తెలుగు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా చేప మందు కోసం హైదరాబాద్కు క్యూ కట్టారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జనాలతో కిక్కిరిసిపోయింది. నిన్న సాయంత్రం ఆరు గంటలకు చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
అస్తమా రోగులకు ఉపశమనాన్ని కలిగించే బత్తిని సోదరుల చేప ప్రసాదం ప్రతీ ఏటా పంపిణీ చేస్తున్నారు. ఈ సారి కూడా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. చేప ప్రసాదం కోసం మత్స్య శాఖ దాదాపు రెండు లక్షలకుపైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. 42 కేంద్రాల ద్వారా చేప ప్రసాద పంపిణీ జరుగుతోంది. జనం ఎగ్జిబిషన్ గ్రౌండ్కు భారీగా తరలివస్తుండడంతో ఎలాంటి తోపులాటలు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మరికొన్ని గంటల్లో చేప ప్రసాదం పంపిణీ ముగియనుండడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

