సీఎం జగన్ ను కలిసేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే రోజా

సీఎం జగన్ ను కలిసేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కాసేపట్లో అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవనున్నారు. మంత్రిపదవి రాకపోవడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. మంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా ఆమె హాజరు కాలేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం ఆమె దూరంగా ఉంటున్నారు. దీంతో సీఎం జగన్ సోమవారం రాత్రి రోజాకు ఫోన్ చేసి అమరావతి రావాలని కోరినట్టు తెలుస్తోంది. ఆమెకు రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్మెన్ పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ ఛైర్మెన్ పదవి రోజాకు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది.. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్న తరుణంలో ఛైర్మెన్ పదవి ఉంటుందా అన్న సందేహం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story