శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉద్యోగం చేస్తున్న యువతి మిస్సింగ్
BY TV5 Telugu13 Jun 2019 5:46 AM GMT

X
TV5 Telugu13 Jun 2019 5:46 AM GMT
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అదృశ్యం మిస్టరీగా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి వారం రోజులైనా ఆచూకి తెలియలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్పోర్టు పీఎస్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన 28 ఏళ్ల రాజ్యలక్ష్మి రెండేళ్లుగా విమానాశ్రయంలో తాత్కాలిక ఉద్యోగం చేస్తోంది. అవివాహితైన రాజ్యలక్ష్మి RB నగర్కాలనీలో అద్దెగదిలో నివసిస్తోంది. ఈ నెల 7న ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె ఇప్పటి వరకు ఆచూకీలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు.
Next Story
RELATED STORIES
Chandra Babu : ప్రతీ ఒక్కరూ దేశభక్తి, జాతీయభావం పెంపొందించుకోవాలి :...
13 Aug 2022 6:47 AM GMTVizianagaram : బయటపడ్డ ఆ పురాతన లాకర్లో ఏముందంటే..?
13 Aug 2022 5:31 AM GMTYS Sunitha : వివేకా హత్య కేసుపై సుప్రీంను ఆశ్రయించిన వైఎస్ సునీత..
13 Aug 2022 4:07 AM GMTAP Discom : ఆర్థిక సంక్షోభంలో ఏపీ డిస్కంలు.. ప్రజల పై అదనంగా ఎంత భారం...
13 Aug 2022 3:30 AM GMTGorantla Nude Video : హీటెక్కుతున్న గోరంట్ల న్యూడ్ వీడియో వివాదం..
13 Aug 2022 3:00 AM GMTVishakapatnam : విశాఖ తీరంలో మరో ప్రేమజంట ఆత్మహత్య..
12 Aug 2022 11:46 AM GMT