సీఎం జగన్ ఢిల్లీ టూర్.. అజెండా అదే!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఐదుగంటలకు కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలుస్తారు. హోంమంత్రి అమిత్‌షాతో జగన్‌ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో భేటీ అనంతరం రాత్రి ఢిల్లీలోని 1- జనపథ్‌లో బస చేస్తారు.

శనివారం వైఎస్స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనతో పాటు, విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర సమస్యలపై పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన తీరుపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు‌. అనంతరం నీతి ఆయోగ్‌ సమావేశాల్లో పాల్గొననున్నారు ఏపీ సీఎం జగన్‌.

Tags

Read MoreRead Less
Next Story