మాంచెస్టర్ మ్యాచ్లో ఆధిపత్యం కనబరుస్తోన్న టీమిండియా

By - TV5 Telugu |16 Jun 2019 3:44 PM GMT
మాంచెస్టర్ మ్యాచ్లో టీమిండియా ఆధిపత్యం కనబరుస్తోంది. బ్యాటింగ్లో భారీస్కోర్ చేసిన కోహ్లీసేన... బౌలింగ్లోనూ రాణిస్తోంది. ఛేజింగ్లో పాక్ బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తోంది. 337 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో పాక్ 13 పరుగులకే వికెట్ కోల్పోయింది. విజయ్శంకర్ తాను వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. అయితే భువనేశ్వర్కు కండరాలు పట్టేయడంతో విజయ్ శంకర్ ఆ ఓవర్ను పూర్తి చేశాడు. తర్వాత కూడా పాక్ బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు శ్రమిస్తున్నారు. మన బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తుండడంతో పాక్కు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com