టీడీపీ వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం ఐదురోజులపాటు సమావేశాలు జరిగాయి. సభ 19 గంటల 25 నిమిషాలు నడిచింది.. తొలి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం, స్పీకర్ ఎంపిక జరిగాయి. అనంతరం గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగింది. చివరిరోజు డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.. ఆ తర్వాత జగన్ ప్రత్యేక హోదా పై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఇదే అంశంపై అసెంబ్లీ వాడివేడిగా సాగింది. ప్రతిపక్షం, అధికార పక్షాల పరస్పర ఆరోపణలతో సభ హీటెక్కింది.
అసెంబ్లీని స్పీకర్ నడిపించడం లేదని.. సీఎం జగనే నడిపిస్తున్నారన్న టీడీపీ ఆరోపణలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇరు పక్షాలు సమానమేనని చెప్పారు. చైర్ కు ఎలాంటి దురుద్దేశాలు ఆపాదించొద్దని అన్నారు స్పీకర్ తమ్మినేని.
చంద్రబాబు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు సీఎం జగన్. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్లానింగ్ కమిషన్కు ఒక్కసారి కూడా లేఖ రాయలేదని ఆరోపించారు. గట్టిగా ప్రయత్నించి ఉంటే స్పెషల్ స్టేటస్ ఎప్పుడో వచ్చేదని జగన్ అన్నారు.
RELATED STORIES
Naga Chaitanya: గర్ల్ఫ్రెండ్తో కారులో చైతూ రొమాన్స్.. ఇంతలో...
14 Aug 2022 4:16 PM GMTAnasuya Bharadwaj: అవి నచ్చకే షో వదిలేశాను: అనసూయ భరద్వాజ్
14 Aug 2022 12:15 PM GMTVijay Devarakonda: విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ నటి కాదు..! ఆ మాటలకు...
14 Aug 2022 11:30 AM GMTVijayashanthi: 'టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్...
14 Aug 2022 10:50 AM GMTNTR: 'కొమురం భీం' పాత్రకు ఆస్కార్.. హాలీవుడ్లో కథనం..
14 Aug 2022 10:10 AM GMTDJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్లో మలయాళ...
13 Aug 2022 4:23 PM GMT