టీడీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పుపై స్పందించిన చంద్రబాబు

X
By - TV5 Telugu |20 Jun 2019 7:34 PM IST
టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరనున్నారన్న వార్తలపై.. పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు. మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో.. పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడారు. పరిస్థితిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో టీడీపీ పోరాడిందన్నారు చంద్రబాబు. ఎంపీల జంపింగులను ప్రోత్సహిస్తున్న బీజేపీ చర్యలను బాబు తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని.. నేతలు, కార్యకర్తలు అధైర్య పడొద్దని చంద్రబాబు సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com