పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తిని నరికి..
By - TV5 Telugu |21 Jun 2019 10:34 AM GMT
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా నరికి చంపారు. చనిపోయిన వ్యక్తిని నాగుల రవిగా గుర్తించారు. బైక్ పై వెళ్తున్న రవిని సినీఫక్కీలో వెంబడించారు ముగ్గురు దుండగులు. కత్తులతో కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాగుల రవి ఎవరు? అతడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో విచారిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు పోలీసులు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com