వరల్డ్కప్లో ఆతిథ్య ఇంగ్లాండ్కు షాక్

By - TV5 Telugu |22 Jun 2019 2:22 PM GMT
వరల్డ్కప్లో ఆతిథ్య ఇంగ్లాండ్కు షాక్ తగిలింది. వరుస పరాజయాలతో డీలాపడిన శ్రీలంక , ఇంగ్లీష్ టీమ్ను ఓడించింది. మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 232 పరుగులు చేసింది. ఫెర్నాండో 49 , మాథ్యూస్ 85 పరుగులతో రాణించారు. ఛేజింగ్లో లంక పేసర్ మలింగ ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. పదునైన యార్కర్లతో ఇంగ్లాండ్ను భయపెట్టిన మలింగ 4 వికెట్లతో లంకను గెలిపించాడు. చివర్లో బెన్ స్టోక్స్ ఒంటరి పోరాటం చేసినా... మిగిలిన బ్యాట్స్మెన్ సపోర్ట్ లేకపోవడంతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com