ఆసక్తికరంగా భారత్‌, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌

ఆసక్తికరంగా భారత్‌, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌

సౌతాంప్టన్ వేదికగా జరుగుతోన్న భారత్, ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. 225 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ 20 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి వచ్చిన షమీ ఈ వికెట్ పడగొట్టాడు. అయితే తర్వాతి బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. అంతకుముందు భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో ఆప్ఘన్ బౌలర్లు సక్సెసయ్యారు. కోహ్లీ, కేదార్ జాదవ్ హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్ 224 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌ మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్లు కీలకం కానున్నారు.

Tags

Next Story