సచిన్, లారా రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

By - TV5 Telugu |22 Jun 2019 1:03 PM GMT
టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ ప్రపంచ క్రికెట్లో మరో అరుదైన రికార్డ్ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్తో జరుగుతోన్న మ్యాచ్లో 104 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో సచిన్, లారా పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్,లారా 453 ఇన్నింగ్స్లలో 20వేల రన్స్ చేస్తే... విరాట్ కేవలం 416 ఇన్నింగ్స్లలోనే దానిని అందుకున్నాడు. అలాగే ఈ ఘనత సాధించిన 12వ క్రికెటర్గానూ, మూడో భారత బ్యాట్స్మెన్గానూ కోహ్లీ నిలిచాడు. భారత తరపున గతంలో సచిన్, ద్రావిడ్ మాత్రమే ఈ రికార్డు అందుకున్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com