బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్న్యూస్..

X
By - TV5 Telugu |26 Jun 2019 12:21 PM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బ్యాంక్ కస్టమర్లకు తీపి కబురు అందించింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఆన్లైన్లో పిర్యాదు చేసేందుకు వీలుగా ఒక అప్లికేషన్ను ఆవిష్కరించింది. దీనిపేరు కార్పొరేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎంఎస్). ఇందుకోసం ఆర్బీఐ వెబ్సైట్లో ఎడమవైపున కరెంట్ రేట్స్ కింద ఒక విండో కనిపిస్తుంది. దీనిపై ఆర్బీఐ లోగో ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కస్టమర్లు ఏ బ్యాంకుకు చెందిన వారైనాసరే ఫిర్యాదు చేసే వీలుంది. ఫిర్యాదు చేసిన తర్వాత అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే ఈ లింక్ https://cms.rbi.org.in/cmc/indexPage.aspx?aspxerrorpath=/cms/indexpage.aspx సాయంతో డైరక్ట్గా ఫిర్యాదు చేయవచ్చు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com