కులాంతర వివాహం చేసుకుందని.. కన్న కూతురినే..

కులాంతర వివాహం చేసుకుందని.. కన్న కూతురినే..

చిత్తూరు జిల్లా పమలనేరులో పరువు హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందని.. కన్న కూతురినే తల్లిదండ్రులు చంపేశారు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న హేమావతి, కేశవులు.. ఇంటి నుంచి వెళ్లిపోయి వేరు కాపురం పెట్టుకున్నారు. 7 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చిన హేమావతి.. ఆస్పత్రి నుంచి తిరిగొస్తుండగా.. కుటుంబ సభ్యులు దారికాచి దాడి చేశారు. హేమావతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని కాలువపల్లి సమీపంలోని చెత్తపంట దగ్గర పడేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ పరువు హత్య విషయం బయటపడింది.

Tags

Read MoreRead Less
Next Story