విషాదం.. గోడ కూలి 15 మంది మృతి.. శిథిలాల కింద మరికొందరు..

By - TV5 Telugu |29 Jun 2019 6:03 AM GMT
వరుణుడు ముంబై నగరాన్ని వణికిస్తున్నాడు. జోరున కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్థవ్యస్థమవుతోంది. ఈనేపథ్యంలో పూణేలోని కుంద్వాలో గోడ కూలి 15 మంది మతి చెందారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని కొంధ్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తులో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com