విజయం కోసం చమటోడుస్తోన్న భారత్

X
By - TV5 Telugu |30 Jun 2019 9:33 PM IST
ఎడ్జ్ బాస్టన్ వన్డేలో విజయం కోసం భారత్ చమటోడుస్తోంది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రాహుల్ డకౌట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీతో కలిసి... నెమ్మదిగా ఆడాడు. 23 ఓవర్లకు గానీ భారత్ వంద పరుగుల మార్కు అందుకోలేదు. అయితే క్రమంగా జోరు పెంచిన రోహిత్, కోహ్లీ.. అర్థసెంచరీలు సాధించారు. ఇంతలో 66 పరుగులు చేసిన కోహ్లీ ప్లంకెట్ బౌలింగ్లో అవుటయ్యాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com