అవినీతికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి : మంత్రి కన్నబాబు

X
By - TV5 Telugu |30 Jun 2019 6:59 PM IST
గత ప్రభుత్వ హాయంలో జరిగిన ప్రతి అవినీతి అంశంపైనా విచారణ జరిపిస్తామన్నారు మంత్రి కన్నబాబు.. కొన్ని అంశాల్లో అవినీతికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ప్రతి నాలుగైదు రోజులకోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి బుగ్గన. 15 రోజులకోసారి సీఎం జగన్ సమీక్షిస్తారని, 45 రోజుల్లో ప్రాథమిక నివేదిక అందజేస్తామని కన్నబాబు తెలిపారు.
అంతకుముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మంత్రివర్గ ఉపసంఘం భేటీ పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా 30 అంశాల్లో అవినీతిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో సబ్కమిటీకి జగన్ సూచనలు చేశారు. రేపు మంత్రి వర్గ ఉపసంఘం.. వివిధ శాఖల అధికారులతో సెక్రెటరియేట్లో సబ్ కమిటీ సమావేశం కావాలని సీఎం సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com