రూ.271 కోట్లతో దుబాయ్ రాజు ఆరో భార్య జంప్..

రూ.271 కోట్లతో దుబాయ్ రాజు ఆరో భార్య జంప్..

ఎగిరిపోతే ఎంతబాగుటుంది అనుకున్నారేమో దుబాయ్ రాజు భార్య ప్రిన్సెస్ హయా బింత్ అల్ హుస్సేన్. యూఏఈ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు ఆరో భార్య అయిన హయా బింత్ రూ.271 కోట్ల ధనాన్ని, తన ఇద్దరు పిల్లలను తీసుకుని లండన్ ఫ్లైట్ ఎక్కేశారు. ఇటీవల భర్త షేక్ మహ్మద్ బిన్ రషీద్ నుంచి విడాకులు కోరిన హయా బింత్ ఓ జర్మనీ దౌత్యవేత్త సాయంతో లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో ఉంటే తన ప్రాణాలకు ముప్పు తప్పదని భావించి, ఆమె తన పిల్లలతో జర్మనీలో ఉండేందుకు అక్కడి ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు సమాచారం. అయితే ఈ రెండు దేశాల మధ్య వైరుధ్యం కొనసాగుతున్న నేపథ్యంలో.. తన భార్యను తిరిగి అప్పగించాలన్న రషీద్ అభ్యర్థనను జర్మనీ తోసిపుచ్చినట్లు వార్తల సారాంశం. 2004లో రషీద్‌తో హయా బింత్ వివాహం జరిగింది. కాగా, గత ఏడాది కూతురు లతిఫా కూడా పారిపోయేందుకు ప్రయత్నించగా, అమెని పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఇప్పుడు భార్య కూడా కూతురి బాటలోనే పయనించింది.. భర్త వేధింపులు భరించలేకే ఆమె ఈ పని చేసిందని మానవ హక్కుల కార్యకర్త రాధా స్టిర్లింగ్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story