12 మంది చిన్నారులకు అస్వస్థత
By - TV5 Telugu |1 July 2019 1:48 AM GMT
విజయనగరం జిల్లా కురుపాంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే సారి 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. కురుపాం మండలం బల్లుకోట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 12 మంది చిన్నారులకు ఒకేసారి వాంతులు కావడంతో భయపడిన తల్లిదండ్రులు కురుపాం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామంలో కలుషిత నీరు తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారని గ్రామస్తులు భావిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారంతా 6 నెలల నుంచి 10 ఏళ్లలోపు వారేనని వైద్యులు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com