వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నా లక్ష్మీనారాయణ

2014లో టీడీపీ చేసిన ఆరాచకాలనే.. ఇప్పడు వైసీపీ వాళ్లు చేస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కన్నా. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పర్యటించిన కన్నా దాచేపల్లి పట్టణంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. మాచర్ల మండలం జమ్మలమడకలో బీజేపీ జెండా ఆవిష్కరణకు సిద్ధం చేస్తున్న దిమ్మెను వైసీపీ వాళ్లు అడ్డుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల జోలికివస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజలు వైసీపీకి ఓ అవకాశం ఇచ్చారని..ఆ అవకాశాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన కార్యకర్తలకు కండువా కప్పి పార్లీలోకి ఆహ్వానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com