పల్నాడు ఎగువ ప్రాంతానికి నీళ్లు కావాలి : లోక్ సభలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు

X
By - TV5 Telugu |3 July 2019 7:37 PM IST
పల్నాడు ఎగువ ప్రాంతానికి జలకళ తేచ్చే ప్రయత్నం చేయాలన్నారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. లోక్సభలో మాట్లాడిన ఆయన.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కృష్ణా నదికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ సాగు, తాగు నీరందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడుకి ఆయువుపట్టు లాంటి వరికిపూడిశెల పూర్తయితే సుమారు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 90 గ్రామాలకుపైగా తాగు నీరందించే వెసులుబాటు కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తక్కువ వ్యయమే అయినా.. అప్పటి పాలకులు నిర్లక్ష్యం చేశారని.. కేంద్రం నిధులు ఇచ్చి.. ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com