TRS పార్టీని గద్దె దింపే వరకు బీజేపీ పోరాటం ఆగదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

X
By - TV5 Telugu |4 July 2019 8:58 PM IST
TRS పార్టీని గద్దె దింపే వరకు బీజేపీ పోరాటం ఆగదని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి.. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు బీజేపీలోకి వస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు.. లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ నెల ఆరో తేదీన రాష్ట్రానికి అమిత్ షా రానున్నారని.. తెలంగాణలో 40 శాతం నూతన సభ్యత్వాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని లక్ష్మణ్ వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com