22 రోజులు అయినా.. తప్పి పోయిన బాబు కోసం వెతుకుతూనే ఉన్నారు
ఒకటి రెండు కాదు.. 22 రోజులు అయినా.. తప్పి పోయిన బాబు కోసం వెతుకుతూనే ఉన్నారు.. అల్లారు ముద్దుగా పెంచుకున్న బాబు తప్పిపోవడంతో రేణిగుంట రైల్వే స్టేషన్లో 22 రోజులుగా పడిగాపులు కాస్తోంది ఓ జంట. కనిపించే ప్రతివారినీ తమ బిడ్డ ఎక్కడైనా కనిపించిందా అని ఫోటో చూపిస్తూన్నారు. అయితే ఆ ఫోటో చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు..
గుజరాత్లో సూరత్కు చెందిన బట్టల వ్యాపారీ జెఇస్ భాయ్, ఆయన భార్య మీనాకు వివాహమైన 17 ఏళ్లు అయ్యింది. సంవత్సరాలు గడుస్తున్నా.. పిల్లలు పుట్టకపోవడంతో.. గతేడాది ఓ పిల్లిని తెచ్చుకుని.. దానికి బాబు అని పేరు పెట్టుకున్నారు. పిల్లలు లేరనే విషయాన్ని మరిచి సొంత బిడ్డలా.. పిల్లిని చూసుకుంటున్నారు.
శ్రీవారి దర్శనం కోసం.. తమ బిడ్డలా చూసుకుంటున్న పిల్లిని కూడా వెంటపెట్టుకొచ్చారు తిరుమలకు వచ్చారు.. శ్రీవారి దర్శనం తరువాత తిరిగి వెళ్లేందుకు రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న సమయంలో.. తమ పిల్లిని ఎవరో ఎత్తుకుపోయారు. అప్పటి నుంచి తప్పి పోయిన పిల్లి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇది గమనించిన కొందరు ఆకతాయిలు పిల్లిని చూపిస్తామంటూ వారి దగ్గర నుంచి 50 వేల రూపాయలకు పైగా వసూలు చేశారు. స్థానిక డ్రైవర్లు.. విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు..
పిల్లి తప్పిపోయిందని కేసు పెట్టలేమని చెప్పిన పోలీసులు.. తమ సొంతూరు వెళ్లిపోవాలని.. దొరికితే సమాచారం అందిస్తామని చెప్పారు. అయినా ఆ జంట మాత్రం ఎక్కడికి వెళ్లకుండా.. తప్పిపోయిన పిల్లికోసం పరితపించిపోతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com