అలకబూనిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

X
By - TV5 Telugu |5 July 2019 7:06 PM IST
గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రిష్ణ మోహన్ రెడ్డి అలకబూనారు. తనకు కేటాయించిన గన్మెన్ను వెనక్కు పంపారు. వ్యక్తిగత కారణాలంటూ సాకుగా చూపుతున్నా... మంత్రి నిరంజన్ రెడ్డితో ఉన్న విభేదాలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల జడ్పీ సీఈవో నియామకం విషయంలో ఈ విబేధాలు ముదిరి పాకాన పడ్డట్లు తెలుస్తోంది. దీనికి తోడు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు విషయంలోనూ... ప్రభుత్వం స్పందన చూపడం లేదని ఎమ్మెల్యే బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలోనే క్రిష్ణమోహన్ రెడ్డి... గన్మెన్లను సరెండర్ చేశారని తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com