వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ జారీ
BY TV5 Telugu6 July 2019 5:31 AM GMT

X
TV5 Telugu6 July 2019 5:31 AM GMT
చెక్ బౌన్స్ కేసులో చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఎమ్మెల్యే బాబు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో... ఒంగోలుకు చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణకు హాజరు కావాలని బాబును కోర్టు ఆదేశించింది. విచారణకు రాకపోవడంతో.. ఒంగోలు సంచాలక న్యాయస్థానం ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Next Story