మానసిక వికలాంగురాలిపై దారుణానికి ఒడిగట్టిన మృగాడు..

X
By - TV5 Telugu |7 July 2019 2:30 PM IST
మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన ఓ మానసిక వికలాంగురాలిపై రవి అనే వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. తల్లితో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఎత్తుకెళ్లాడు. ఎంతకీ కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించింది తల్లి. అచేతన స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన ఆమె కన్నీరుమున్నీరైంది. రవిపై అనుమానం వచ్చిన బంధువులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com