ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు : అఖిలపక్షం నేతలు

ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు : అఖిలపక్షం నేతలు

ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు అఖిలపక్షం నేతలు. తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ కూల్చివేతను నిరసిస్తూ మాజీ ఎంపీ వివేక్ ఆధ్వర్యంలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశమైంది. పార్టీలకు అతీతంగా భవనాల కూల్చివేతను అడ్డుకోవాలని నిర్ణయించారు. వ్యక్తి గత నమ్మకాలకు సీఎం కేసీఆర్‌ విలువ ఇస్తూ.. ప్రజల నమ్మకాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు విపక్ష నేతలు. కొత్త అసెంబ్లీ, సచివాలయం ప్రజలకు అవసరం లేదని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. వాటి కూల్చడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేమని స్పష్టం చేశారు .

అసెంబ్లీని, సచివాలయాన్ని ఎందుకు కూల్చుతున్నారో.. ఎందుకు కొత్తవి కడుతున్నారో ఇంత వరకు కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పలేదని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. తమకు మెజార్టీ ఉందని కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా.. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీని ప్రాంభించారని గుర్తుచేశారు రావుల.

ప్రజలను తప్పుదోవ పట్టించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్స్‌ఫర్ట్ అని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. మూఢనమ్మకాలను ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ , సచివాలయం కట్టి 35 ఏళ్లు కూడా దాటలేదని అన్నారు. సచివాలయంలో ఎల్ బ్లాక్‌ను చంద్రబాబు అద్బుతంగా మార్చారని పేర్కొన్నారు. సెక్షన్ 8 ప్రకారం భవనాలను కాపాడాల్సిన భాధ్యత గవర్నర్ దే అని అన్నారు రేవంత్ రెడ్డి.

Tags

Next Story