రాంప్రసాద్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి..

రాంప్రసాద్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి..

సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులొకొచ్చింది. రాంప్రసాద్‌ని తానే హత్య చేశానంటూ మీడియా ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నాడు నిందితుడు శ్యామ్ . చోటూ, నరేష్‌తో కలిసి ఈ హత్య చేసినట్టు చెప్పాడు.. మర్డర్ చేసింది తానేనని...చేయించింది మాత్రం రాంప్రసాద్ బావమరిది శ్రీనివాస్ అని పేర్కొన్నాడు. రాంప్రసాద్ పై అటాక్ చేసిన తర్వాత ఎల్బీనగర్ మీదుగా విజయవాడ పారిపోయినట్లు తెలిపాడు శ్యామ్.

రాం ప్రసాద్‌ను హత్యచేసేందుకు చాలా రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు తెలిపాడు శ్యామ్. నెల క్రితమే హైదరాబాద్ వచ్చినట్లు చెప్పాడు. రాంప్రసాద్ కు తనకు ఎప్పటి నుంచో వైరం ఉందని.. 2012లో తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నాడు.. అప్పట్లో రాంప్రసాద్, ఆయన బావమరిది శ్రీనివాస్ మధ్య సత్సంబంధాలు ఉన్నా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేదాలు వచ్చాయని శ్యామ్ తెలిపాడు. రాంప్రసాద్ కారణంగా శ్రీనివాస్ కూడా భారీగా నష్టపోయాడని చెప్పాడు. రాం ప్రసాద్ ను మర్డర్ చేస్తే 30 లక్షలు ఇస్తానని శ్రీనివాస్ ఆఫర్ చేశాడని సంచలన నిజాలు బయటపెట్టాడు. అందరికీ కోగంటి సత్యంపైనే అనుమానం వస్తుందని శ్రీనివాస్ ముందుగానే గెస్ చేసినట్లు పేర్కొన్నాడు నిందితుడు శ్యామ్. .

అయితే మర్డర్ జరిగిన రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన శ్యామ్ పై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేసులోంచి ప్రధాన నిందితులను తప్పించేందుకు ఈయన్ను తెరపైకి తీసుకొచ్చారన్న వాదన వినిపిస్తోంది...శ్యామ్ చెప్పే పలు అంశాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. అటు నిందితుడు శ్యామ్ స్వయంగా కోగంటి సత్యంకు క్లీన్ చీట్ ఇవ్వడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.. శ్యామ్ చేస్తున్న ఆరోపణలపై రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ స్పందిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

అటు ఈ హత్య వెనుక కోగంటి సత్యం పాత్ర ఉందని, సుపారీ గ్యాంగ్‌తో మర్డర్ చేయించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు సత్యంను అదుపులోకి తీసుకుని.. సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించారు. రాంప్రసాద్‌ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి మూలాలు విజయవాడలో ఉన్నట్టు గుర్తించి... ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. గతంలో రాంప్రసాద్, కోగంటి సత్యానికి తలతెత్తిన విభేదాలు, వారి కదలికలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అతడి కాల్‌డేటాను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి వెళ్లిన కోగంటి సత్యం కుటుంబ సభ్యులు.. విజయవాడ రాగా, ఆయన హైదరాబాద్ ఎందుకు వెళ్లారో అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు

హైదరాబాద్‌ పంజాగుట్టలో హత్యకు గురైన రాంప్రసాద్ తనపై దాడి జరగొచ్చని ముందే ఊహించాడు.. అందుకే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడే వ్యాపారం నిర్వహిస్తున్నాడు.. ప్రాణహాని ఉందంటూ ... గతంలో ఏపీ డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాదు.... ఆయన ఊహించినట్లే హైదరాబాద్ లోనే దారుణహత్యకు గురయ్యారు రాం ప్రసాద్.

Tags

Read MoreRead Less
Next Story